గత రెండేళ్ళుగా నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ని తెలుగు తెరకి ఎప్పుడు పరిచయం చేస్తారా అని. ఈ విషయంలో ఇప్పటికే చాలా సార్లు చాలా రకాలుగా వార్తలు వచ్చాయి. అంతేకాదు గత సంవత్సరం కూడా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఎందుకనో ఆ ప్రయత్నం మళ్ళీ ఆగిపోయింది. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సంవత్సరం మోక్షజ్ఞ ఎంట్రీ కాస్త కష్టమే.
ఈ నేపథ్యంలో నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ని 2021 లో అయినా హీరోగా పరిచయం చేయమని బాలయ్యని అడుగుతున్నారట. అయితే ఇప్పటికే మోక్షజ్ఞ ని పరిచయం చేయబోతున్న డైరెక్టర్ ఇతనే అంటూ చాలామంది దర్శకుల పేర్లు ప్రచారంలో నిలిచాయి. రీసెంట్ గా మోక్షజ్ఞ ని హీరోగా పరిచయం చేసే బాధ్యత అనిల్ రావిపూడి కి బాలయ్య అప్పగించారన్న వార్త కూడా వచ్చింది. అయితే ఇందులో వాస్తవం లేదని అన్నారు. అంతేకాదు ప్రముఖ మాటల రచయిత్ర సాయి మాధవ్ బుర్రా మోక్షజ్ఞ కోసం అద్భుతమైన కథ సిద్దం చేస్తున్నట్టు ఆయనే ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నట్టు చెప్పుకున్నారు.
ఇవన్ని కేవలం మాటల దగ్గరే ఆగిపోయాయి తప్ప బాలయ్య మాత్రం ఈ వార్తలకి స్పందించలేదు. కాని ఆ మధ్య మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాట్లాడిన బాలయ్య మంచి కథ సిద్దం చేయిస్తున్నట్టు ఖచ్చితంగా ఆ కథ అభిమానులకి బాగా నచ్చేలా ఉంటుంది అన్నారు. అంతేకాదు మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో రక రకాల వార్తలు వస్తున్నాయని నేను మాత్రం తొందరపడటం లేదని చాలా కూల్ గా చెప్పారు. ప్రస్తుతం మోక్షజ్ఞ కోసం కథలు వింటున్నారని సమాచారం. మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ కోసం అద్భుత కథను సెలెక్ట్ చేసి 2021 లో మోక్షజ్ఞ ని తెలుగు తెరకి పరిచయం చేయాలని బాలయ్య అనుకున్నట్లు తెలుస్తుంది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!