Sai pallavi: టాలెంటెడ్ హీరోయిన్..ఫిదా బ్యూటీ సాయి పల్లవి – రానా దగ్గుబాటి జంటగా నటించిన లేటెస్ట్ సినిమా విరాట పర్వం. ఈ సినిమా గత ఏడాది నుంచి అప్పుడు ఇప్పుడు రిలీజ్ అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ రిలీజ్ చేసేందుకు మాత్రం వీలుపడటం లేదు. మధ్యలో విరాట పర్వం సినిమాను నారప్ప, దృశ్యం 2 చిత్రాల మాదిరిగా ఓటీటీలో రిలీజ్ చేసారనే ప్రచారమూ జరిగింది. దాంతో స్వయంగా దర్శకుడు వేణు ఉడుగుల క్లారిటీ ఇస్తూ ఈ సినిమాను థియేటర్స్లోనే రిలీజ్ చేయనున్నామని తేల్చి చెప్పాడు. అలా చెప్పినప్పటి నుంచి అందరూ విరాట పర్వం సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ మధ్య కొత్తగా ఓ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి బాగా వైరల్ అయింది. రిలీజ్ డిలే అవుతున్న విరాట పర్వం సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా తర్వాత రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆ వార్తల సారాంశం. చాలా నెలలుగా విరాట పర్వం సినిమా రిలీజ్ పోస్ట్పోన్ అవుతూ వస్తోంది. దాంతో కొంత జనాలలో ఈ సినిమా మీద ఆసక్తి సన్నగిల్లింది. ఇలాంటి సమయంలో భీమ్లా నాయక్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఇప్పటికే భారీ అంచనాలతో చెప్పుకుంటున్నారు.
Sai pallavi: సాయి పల్లవి పాత్రను వక్రీకరించారని ఆ పాత్రను మార్చాలని పట్టుపట్టారట.
దాంతో ఆ సినిమా తర్వాత రానా క్రేజ్ భారీ స్థాయిలో పెరుగుతుందనే మేకర్స్ ప్లాన్తో విరాట పర్వం సంక్రాతి తర్వాత రిలీజ్ అవుతుందనుకున్నారు. కానీ ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రకు సంబంధించిన కొన్ని సీన్స్ రీ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆమె పాత్ర ఉద్యమకారిణి కాబట్టి ఇటీవల కొందరు ఉద్యమకారులు సాయి పల్లవి పాత్రను వక్రీకరించారని ఆ పాత్రను మార్చాలని పట్టుపట్టారట. అందుకే ఇప్పుడు ఆ పాత్రలో కొన్ని మార్పులు చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అందుకే ఇప్పుడు విరాట పర్వం రిలీజ్ మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?