పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావటమే ప్రశ్నించడానికి అన్నట్టు జనసేన పార్టీ స్థాపించినాడు ప్రకటించడం జరిగింది. అధికారం కోసం రావటంలేదు ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చాను అని పవన్ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రశ్నించడానికి అంటూ పొలిటికల్ ఫీల్డ్ లో అడుగుపెట్టిన ఇన్నాళ్లు పవన్ వ్యవహరించిన శైలీ చూస్తే ఎక్కువగా అధికార పార్టీ లకు భజన చేసేటట్టు గానే వ్యవహరించారు అనే టాక్ ప్రత్యర్థుల లో ఉంది.
2014లో జనసేన పార్టీని స్థాపించగా అప్పట్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు తెలిపిన పవన్.. ఏపీలో చంద్రబాబు పాలన పై భారీ స్థాయిలో వ్యతిరేకత ఉన్నా కానీ ప్రతిపక్షంలో ఉన్న జగన్ పార్టీ నే టార్గెట్ చేసుకుని ప్రశ్నించడం జరిగింది. ఆ సమయంలో పవన్ వ్యవహరించిన తీరుపై చాలా విమర్శలు ప్రజలలో వ్యక్తమయ్యాయి. సరిగ్గా ఎన్నికల వాతావరణం వచ్చేసరికి టిడిపి పార్టీ పై భారీ స్థాయిలో ప్రజా వ్యతిరేకత పెరగటంతో టీడీపీ- బీజేపీ కూటమి నుండి బయటకు వచ్చిన పవన్ వామపక్షాలతో కలిసి 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో రెండు చోట్ల పోటీ చేసి ఘోర ఓటమి చవి చూశారు.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ని గట్టిగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ బీజేపీతో స్నేహాస్తం అందుకుని ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పవన్ కళ్యాణ్ నీ పూర్తిగా ప్రచారానికి వాడుకోవాలి అన్నట్టు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మేటర్ లోకి వెళితే ఇటీవల ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తో పవన్ కళ్యాణ్ భేటీ అవ్వటం అందరికీ తెలిసిందే. అయితే ఈ భేటీలో పవన్ కళ్యాణ్ ని తిరుపతి ఉప ఎన్నికల వరకే పరిమితం చేసేలా చర్చ సాగినట్టు వార్తలు వస్తున్నాయి. జేపీ నడ్డా తో భేటీ అయిన తర్వాత మీడియాతో పవన్ మరియు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎక్కడ కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల విషయం ప్రస్తావించలేదు. అంటే ఇక పవన్ ని కేవలం ఏపీకి పరిమితం చేసే ఆలోచనలో బీజేపీ పెద్దలున్నారనే వాదన బలపడుతోంది. మొత్తం మీద చూస్తే పవన్ ఇమేజ్ ని ఉపయోగించుకుంటే అతన్ని కంట్రోల్ చేసే రీతిలో రెండు రాష్ట్రాలలో జనసేన విస్తరణకు బిజెపి అడ్డుకట్ట వేసినట్లు పరిశీలకుల మాట.