2019 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు బిజెపి పార్టీ పై తీవ్రస్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు. మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో జాతీయ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. కానీ ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో టిడిపి చిత్తుచిత్తుగా వైయస్ జగన్ చేతిలో ఓటమి పాలు కావడంతో… ఒక్కసారిగా చంద్రబాబు కి మైండ్ బ్లాక్ అయింది. ఒకపక్క రాష్ట్రంలో జగన్ భారీ మెజారిటీతో గెలవ గా అదే స్థాయిలో కేంద్రంలో మోడీ కూడా విజయం సాధించారు.
దీంతో చంద్రబాబు రాష్ట్రంలో జగన్ ని ఢీ కొనాలంటే ఖచ్చితంగా కేంద్రం మద్దతు అవసరమని మళ్లీ బి.జె.పి.తో కలవటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కానీ కమల దళం పెద్దలు అసలు చంద్రబాబుకి తలుపు తీసే ప్రసక్తే లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ తర్వాత రాజకీయంగా ఎదుగుతున్న బలపడుతున్న పార్టీగా బిజెపి మంచి దూకుడు మీద ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటాలని…నగరం నడిబొడ్డులో బీజేపీ జండా ఎగరాలని ఆ పార్టీకి చెందిన పెద్దలు వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి కూడా పోటీకి దిగింది.
ఈ నేపథ్యంలో ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్న విషయంపై పార్టీ నేతలతో జూమ్ యాప్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలలో పోటీచేసే నేతల జాబితాను తయారు చేయాలని హైదరాబాద్ టీడీపీ నేతలకు చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి డివిజన్ లో టిడిపి తరుపున యువనేతను నిలబెట్టాలని సదరు నేతలకు చంద్రబాబు ఆదేశం ఇచ్చారట. గతంలో టీడీపీ హయాంలో హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధిని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఈ సందర్భంగా బాబు తెలిపారట.
ఇదిలా ఉండగా జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికలలో టిడిపి ఒంటరిగా పోటీ చేస్తే కేవలం 4 To 5 శాతం ఓట్లు రావని… అదే బిజెపితో కలసి పోటీ చేస్తే 25-30 డివిజన్ లను గెలిచే అవకాశం ఉందని బాబు కింది స్థాయి నాయకులు తెలిపారట. మరి టిడిపి బిజెపి కలిసి పోటీ చేస్తుందా..? అన్న చర్చ ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో మొదలయ్యింది. తెలంగాణలో రాణించాలని చూస్తున్న బిజెపి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీతో కలసి పోటీకి దిగుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఒకవేళ గనుక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గతాన్ని పక్కనపెట్టి బీజేపీ టీడీపీ తో కలిసి పోటీకి దిగితే మాత్రం ఏపీలో కూడా… రాజకీయ ముఖ చిత్రం మారటం గ్యారెంటీ అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?