నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీబీ3 అంటూ చెప్పుకుంటున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఫస్ట్ రోర్ పేరుతో వీడియో టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ అత్యధిక యూట్యూబ్ వ్యూస్ రాబట్టి సంచలనం సృష్ఠించింది. బాలయ్య ని మళ్ళీ అభిమానులు, ప్రేక్షకులు ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలాగే పవర్ ఫుల్ పాత్రలో బోయపాటి చూపిస్తున్నట్టు హింట్ ఇస్తూ ఈ టీజర్ ని రిలీజ్ చేశారు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ ఇద్దరుంటారని తెలుస్తుంది. కాని ఇప్పటి వరకు ఎవరినీ ఫైనల్ చేయలేదు బోయపాటి. కాని బాలయ్య కి జంటగా శ్రియ శరణ్, అంజలి లని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కాని అధికారకంగా మాత్రం బోయపాటి బృందం వెల్లడించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అమలా పాల్ నటించనున్నట్లు సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తుంది. ఇక “ఆమె” సినిమాలో అమలా పాల్ బోల్డ్ గా నటించి ఆకట్టుకుంది.
అంతేకాదు బీబీ3 లో సెకండ్ హీరోయిన్ ను కూడా త్వరలో చిత్ర యూనిట్ ప్రకటించనుందట. ఇక బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ను కూడా విలన్ పాత్ర కి బోయపాటి సంప్రదించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సంజయ్ దత్ కే.జీ.ఎఫ్ ఛాపటర్ 2 లో శక్తి వంతమైన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆ కారణంగానే బాలయ్య కి ఆపోజిట్ గా సంజయ్ దత్ అయితే పోటా పోటీగా ఉంటుందని అంటున్నారు. ఇక మోనార్క్ అన్న టైటిల్ ని బోయపాటి బృందం పరిశీలిస్తుండగా ఇప్పుడు మరో టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. మరి అసలు టైటిల్ ఏదో చిత్ర యూనిట్ రివీల్ చేస్తేనే తెలుస్తుంది.