Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీనప్పటి నుంచి యంగ్ హీరోలకి పోటీగా యంగ్ డైరెక్టర్స్తో వరస సినిమాలను కమిటవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాని పూర్తి చేశారు మెగాస్టార్. కాజల్ అగర్వాల్ మెగస్టార్కి జంటగా కాజల్ అగర్వాల్ నటించింది. ఇక మెగా పవర్ స్టార్ రాం చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా పూజా హెగ్డే చరణ్కి జంటగా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో చరణ్ – పూజా హెగ్డేల మీద పాట చిత్రీకరణ జరుగుతోంది.
ఇక ఈ సినిమాని మే 13న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికారకంగాను ఆచార్య రిలీజ్ డేట్ను ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఆచార్య సినిమా రిలీజ్ పోస్ట్పోన్ చేస్తారని వార్తలు మొదలయ్యాయి. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలీదు గానీ మెగా అభిమానులు మాత్రం బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. ఇదే అనుకుంటే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. మెగాస్టార్ తాజాగా మొదలు పెట్టాలనుకుంటున్న ప్రాజెక్ట్ కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలున్నాయట.
Chiranjeevi : మేకర్స్ నుంచి మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు.
మలయాళ సూపర్ హిట్ సినిమా లూసీఫర్ సినిమా తెలుగు రీమేక్ లో మెగాస్టార్ నటించబోతున్న సంగతి తెలిసందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఏప్రిల్ లో మొదలు పెట్టాలనుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ మే వరకు ఇప్పుడు ఈ సినిమా మొదలు పెట్టే ఆలోచన చేయడం లేదట. మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్న కారణంగా లూసీఫర్ తెలుగు రీమేక్ షూటింగ్ కొన్నాళ్ళు పోస్ట్పోన్ చేస్తున్నారట. అయితే మేకర్స్ నుంచి మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు.