చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రాం చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ – మ్యాట్నీ మూవీస్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో రెజీనా కసాండ్ర స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది. ఇక ఈ సినిమా సమ్మర్ కానుకగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాంతో chiranjeevi నెక్స్ట్ సినిమాలని లైన్ లో పెడుతున్నారు.
ఇప్పటికే రెండు రీమేక్ సినిమాలు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో తమిళ సూపర్ హిట్ వేదాళం అయితే మరో సినిమా మలయాళ సూపర్ హిట్ సినిమా లూసీఫర్. ఈ రెండు సినిమాలని చిరంజీవి రీమేక్ చేస్తున్నట్టు ఎప్పుడో వెల్లడించాడు. కాని ఈ రెండు ప్రాజెక్ట్స్ లో chiranjeevi ఏది ముందు మొదలు పెట్టాలో ఇంకా డిసైడ్ కాలేదని సమాచారం. కాని తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ తెలుగు రీమేక్ ముందు మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి లేదా మార్చ్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.
కాస్త గ్యాప్ లో మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ కూడా మొదలు పెట్టాలని chiranjeevi ప్లాన్ చేస్తున్నాడట. కాతా తాజా సమాచారం ప్రకారం చిరంజీవి మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాం చరణ్ ద్వారా సంప్రదించినట్టు సమాచారం. లోకేష్ కనగ్ రాజ్ తాజాగా విజయ్ తో మాస్టర్ సినిమాని తెరకెక్కించాడు. ప్రస్తుతం లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా విక్రం అన్న సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మరి chiranjeevi కోసం లోకేష్ కనగ్ రాజ్ టాలీవుడ్ కి ఎప్పుడు వస్తాడో చూడాలి.