ఏపీ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తదుపరి ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం తుంది ఊపందుకొంది.చిరంజీవి మా పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తాం..’
అని బీజేపీ నేతలు ఇప్పటికే స్టేట్మెంట్లు ఇచ్చేశారు.ఆ మాటకొస్తే, చిరంజీవికి రాజ్యసభ సీటుతోపాటు, కేంద్ర మంత్రి పదవిని కూడా గతంలోనే బీజేపీ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఇందులో నిజానిజాల మాట ఎలా ఉన్నప్పటికీ చిరంజీవి విషయానికొస్తే ప్రస్తుతానికి ఆయన సినిమాల పైన ఫోకస్ పెట్టారు. రాజకీయాల ఊసే ఎత్తడం లేదు. ఇంకా చెప్పాలంటే చిరంజీవికి రాజకీయాలు పెద్దగా అచ్చి రాలేదు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి పద్దెనిమిది అసెంబ్లీ సీట్లు సాధించి తదుపరి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి ఆ ఆపై కేంద్రంలో మంత్రి మంత్రి పదవి తీసుకొని ఐదేళ్లలోనే ఆయన అని అనుభవించేశారు.
రాష్ట్ర విభజన తదుపరి కాంగ్రెస్ పూర్తిగా రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోవడంతో ఆయన కూడా ఇంటికే పరిమితమయ్యారు. కుమారుడు రామ్ చరణ్ ప్రొడక్షన్స్ లో ఆయన ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. మరో రెండు సినిమాలకు ప్లాన్ చేసుకున్నారు. మెగా కంపౌండ్ నుండి రాజకీయవాసనలే రావడం లేదు. అయితే సోము వీర్రాజు తో చిరంజీవి భేటీ అనంతరం మళ్ళీ ఆయన పేరును రాజకీయాలకు లింకు చేస్తూ ఊహాగానాలు సాగుతున్నాయి. చిరంజీవి బీజేపీలో చేరతారనే ప్రచారానికి తెరలేపారు కొందరు. పైగా, చిరంజీవి చుట్టూ మళ్ళీ ‘క్యాస్ట్ ఈక్వేషన్స్’ని తెరపైకి తెస్తున్నారు.
‘కాపు’ కోటాలో చిరంజీవిని బీజేపీ ఆకర్షిస్తోందన్నది ఆ విశ్లేషణల సారాంశం. ప్రస్తుతం రాజకీయాలు ‘కులం, మతం, ప్రాంతం’ ప్రాతిపదికన నడుస్తున్నాయి గనుక.. ఏమో అలాంటి ‘స్కెచ్’ ఉందేమో కూడా.! కానీ చిరంజీవి గురించి బాగా వారు మళ్లీ ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రాబోరని చెబుతున్నారు. చిరంజీవికి అటు కేసీఆర్ తోనే ఇటు జగన్ తోనూ సత్సంబంధాలు ,సన్నిహిత బంధాలు ఉన్నాయి.
అందరివాడు గా ఆయన చలామణి అవుతున్నారు. ఇక ఇప్పుడ కాషాయ మాల ధరించి మరికొందరికి ఎందుకు దూరం కావాలని చిరంజీవి ఆలోచించక మానరంటున్నారు. పైగా మా కుటుంబం లో ఒకటే పార్టీ అంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్య సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఉద్దేశించిందని చెబుతారు. అవసరమైతే ఆయన జనసేనకే మద్దతిస్తారు తప్పితే వేరే పార్టీలో చేరబోరన్నది రాజకీయ పండితుల విశ్లేషణ.