Ganta srinivasa rao ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటారు అని పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి విశాఖ నార్త్ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తాజాగా వైకాపా గొడుగు లోకి వస్తున్నారని ప్రచారం జోరందుకుంది. తాజాగా ఆయన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి నిరసన తెలపడంతో పాటు ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోడీ కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దని, పరిశ్రమను కాపాడుకోవాలంటే ఏం చేయాలి అన్న సూచనలు చెబుతూ నాలుగు పేజీల లేఖ రాయడాన్ని సైతం గంటా శ్రీనివాసరావు అభినందించారు. నిన్న మొన్నటి వరకు టిడిపిలో ఉంటూ జగన్ వెవ్ లో సైతం శాసనసభ్యుడిగా గెలిచిన గంట ఇప్పుడు అకస్మాత్తుగా వైకాపా రాగం ఎత్తుకోవడం ముఖ్యమంత్రి జగన్ ను అభినందించడం చూస్తుంటే ఆయన వైకాపాలోకి రావడానికి జగన్ ఆమోదం తెలిపినట్లు అర్థం అవుతోందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
Ganta srinivasa rao : భూ వివాదం మరుగున పడటంతో
విశాఖలో వివాదాస్పదంగా మారిన 300 ఎకరాల భూమి భావం మొదట్లో గంటా శ్రీనివాసరావు మెడకే చుట్టుకుంటుందని అంతా అనుకున్నారు. ఆ వివాదంలో ఉన్న ప్రధానంగా వినిపించిన పేరు గంటా శ్రీనివాసరావుదే. విశాఖలో అప్పట్లో భారీగా భూ స్కాఎం జరిగిందంటూ ప్రత్యేక సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెవెన్యూ వ్యవహారాల మీద పూర్తిగా అనుభవం ఉన్న అధికారులతో సిట్ ను ఏర్పాటు చేశారు. అయితే సిట్