పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించబోతున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ తో కలిసి 14 రీల్స్ ప్లస్.. మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తునారు. థమన్ సంగీతమందిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగభాగం పైగా కంప్లీట్ కావాల్సింది. కాని కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా కి అమెరికాలో భారీ షెడ్యూల్ షూటింగ్ చేయాల్సి ఉండడంతో ఇంకా ఆలస్యం అయింది.
వాస్తవంగా ఈ నెలలోనే అమెరికాలో ఫస్ట్ షెడ్యూలు షూటింగ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. 45 రోజుల భారీ షెడ్యూల్ కూడా అనుకున్నారు. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు, కీర్తి సురేష్ పాల్గొనే కీలకమైన సన్నివేశాలతో పాటు రెండు పాటలని ప్లాన్ చేశాడు దర్శకుడు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా పోస్ట్ పోన్ చేశారు. కాగా ఫస్ట్ షెడ్యూలు ఇప్పుడు హైదరాబాదులోనే ప్లాన్ చేసినట్టు తాజా సమాచారం. ఇన్ని రోజులు కాస్త డైలమాలో ఉన్న మేకర్స్ ఇప్పుడు స్ట్రాంగ్ గా ఫిక్సయ్యారట.
ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాదులో ఓ జాతీయ బ్యాంక్ సెట్ ను నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సెట్ పూర్తవుతుందని… ఇందులో దాదాపు నెల రోజుల పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయబోతున్నారని సమాచారం. కాగా ఈ సన్నివేశాలన్ని ఇంటర్వెల్ కి ముందు వస్తాయట. ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసి జనవరి నెలాఖరులో సెకండ్ షెడ్యూలు కోసం అమెరికా వెళ్ళబోతున్నారని అంటున్నారు. బ్యాంకు స్కాముల నేపథ్యంలో సర్కారు వారి పాట కథ సాగుతుందని… ఇందులో మహేష్ బాబు ఆర్థిక నేరస్తుడిగా కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.