మహానటి ఫేం నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఒక భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కబోతుంది. ప్రభాస్ కెరీర్ లో 21 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి అశ్వనీదత్ సమర్పిస్తుండగా ప్రియాంక దత్, స్వప్న దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నిర్మాణ సంస్థ కి 50 వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకోసం దర్శక, నిర్మాతలు రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ ని నిర్మిస్తున్నారు.
ఇక రీసెంట్ గా ఈ సినిమాలో నటించే హీరోయిన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపక పదుకొణె నటిస్తున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. పీరియాడికల్ మూవీ కావడంతోనే దర్శక, నిర్మాతలు దీపిక పదుకొణె ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఇక యువరాణి పాత్ర కావడంతో ప్రభాస్ కి జంటగా దీపిక పదుకొణె అయితేనే పరెఫెక్ట్ అని తనని సెలెక్ట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. అలాగే దీపిక ఇప్పటికే బాలీవుడ్ లో పద్మావత్, భాజీరావ్ మస్తానీ వంటి పీరియాడికల్ మూవీస్ చేసి వరల్డ్ వైడ్ గా విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
అయితే దీపక పదుకునే హీరోయిన్ అని ప్రకటించనప్పటికి పెద్ద హైప్ రాలేదన్న మాట వినిపిస్తుంది. అంటే ప్రకటన కాస్త ప్రభాస్ ఫ్యాన్స్ కి అసంతృప్తిగా ఉందట. ఇక ఈ సినిమా 2021 చిరవరిలో సెట్స్ మీదకి వెళ్ళనుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ కూడా 2022 లో అని సమాచారం. ఇక ఈ సినిమాలో దీపిక పదుకొనె ప్రొఫెషనల్ డాన్సర్ గా కనిపించబోతుందట
ప్రభాస్ యంగ్ డైరెక్టర్ జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నాడు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రభాస్ కి జంట గా నటిస్తుండగా ఈ పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమా 2021 లో రిలీజ్ కానుంది.