డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాధే శ్యామ్ తర్వాత తన 21వ సినిమాని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లో సి. అశ్వనిదత్ నిర్మిస్తుండగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె హీరోయిన్ గా ఎంచుకున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో నటించేందుకు గాను దీపికా భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. దీపికా పదుకొణె కూడా ఈ విషయాన్ని వెల్లడించిందని చెప్పుకున్నారు. ఈ క్రమంలో నిర్మాతలు అడ్వాన్స్ ఇస్తానని అన్నారట. కాని దీపిక మాత్రం ఇప్పుడు అడ్వాన్స్ వద్దని చెప్పినట్టు తెలుస్తుంది.
ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. దీపిక ఎందుకు ఇస్తానన్న అడ్వాన్స్ వద్దని చెప్పిందని తెగ ఆలోచిస్తున్నారట. అయితే సినిమాకు ఇప్పుడు ఓకే చెప్పినప్పటికి చిత్రీకరణ మొదలయ్యే సమయానికి ఏదైనా సమస్యలు వస్తే ప్రాజెక్ట్ నుంచి డ్రాపవ్వచ్చు అన్న కారణంగానే దీపిక నిర్మాతలు ఇస్తానన్న అడ్వాన్స్ వద్దందని టాక్. అయితే ఈ మాటలు పూర్తిగా అవాస్తవమని సమాచారం.
దీపిక అడ్వాన్స్ తీసుకోకపోడానికి అసలైన కారణం వేరే ఉందట. ఇప్పుడే అడ్వాన్స్ గా డబ్బు తీసుకునే కంటే సినిమా స్టార్ట్ అయ్యాక తీసుకుంటే నిర్మాతకు చాలా వరకు కలిసి వస్తుందన్న ఉద్దేశ్యంతోనే దీపిక అడ్వాన్స్ వద్దని చెప్పిందట. ఇందులో భర్త రణవీర్ సింగ్ సలహా కూడా ఉందని అందరు చెప్పుకుంటున్నారు. ఇదే గనక నిజమైతే దీపిక దంపతులు గ్రేటే అనాలి.