స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నివేదా థామస్ నటించే అవకాశాలున్నాయట. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అల్లు అర్జున్ – సుకుమార్ -దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకి మ్యూజిక్ పరంగా ఎన్నో అంచనాలుంటాయి.
ఇప్పటి వరకు ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్ని మ్యూజిక్ పరంగా సూపర్ హిట్ అయ్యాయి. ఆర్య, ఆర్య 2 తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి అల్లు అర్జున్ – సుకుమార్ – దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్ రిపీటవుతుండటంతో ప్రేక్షకులు మ్యూజిక్ విషయంలో ఇప్పటికే ఒక అంచనాకి వచ్చేశారు. అయితే గత కొంత కాలంగా దేవీశ్రీప్రసాద్ ఇస్తున్న ట్యూన్స్ మరీ రొటీన్ గా ఉంటున్నాయన్న ఫీడ్ బ్యాక్ వస్తోంది. ఈ లోపు ఎస్ ఎస్ థమన్ దూకొచ్చాడు.
బ్లాక్ బస్టర్ ఆల్బం ఇస్తూ స్టార్స్ నటిస్తున్న సినిమాలన్నిటిని దక్కించుకుంటున్నాడు. దాంతో దేవీశ్రీప్రసాద్ రేస్ లో వెనకబడ్డాడు. అయితే పుష్ప సినిమాతో మళ్ళీ దేవీశ్రీ అంటే ఏంటో నిరూపిస్తాడట. ఈ సినిమాకి దేవిశ్రీ కసితో పనిచేస్తున్నాడని, ఈ సారి సాంగ్స్ అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. అంతేకాదు పుష్ప సినిమాతో దేవి మ్యూజిక్ లో మళ్ళీ ట్రెండ్ సెట్ చేస్తాడని మేకర్స్ ధీమాగా ఉన్నారు. పుష్ప సినిమాతో మళ్ళీ సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చి తమన్ ని టార్గెట్ చేయాలన్న కసితో ఉన్నాడని అంటున్నారు.
ప్రస్తుతం దేవీశ్రీప్రసాద్ ఐటం సాంగ్ను కంపోజ్ చేసే పనిలో ఉన్నాడట. మొత్తానికి పుష్ప సినిమా కోసం దేవీశ్రీప్రసాద్ రెడీ చేసే ఐటమ్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం గ్యారెంటీ అని చెబుతున్నారు. కరోనా తర్వాత పుష్ప సినిమా షెడ్యూల్ మొదలు పెడతారట. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ – రష్మిక పై సాంగ్ షూట్ చేయనున్నారని సమాచారం. 5 భాషల్లో రిలీజ్ కాబోయో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?