టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ ఒకరు. నిర్మాతగానే కాదు డిస్ట్రిబ్యూటర్ గా కూడా దిల్ రాజు ఇప్పటి వరకు ఎన్నో సక్సస్ లను చూశాడు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకొని జాను సినిమాని నిర్మించారు. అక్కినేని సమంత, శర్వానంద్ జంటగా రూపొందిన ఈ సినిమా కోలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన 96 కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కించారు. మజిలీ, ఓ బేబీ సినిమాల తర్వాత ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకున్న సమంత కి జాను షాకిచ్చింది. ఇక వరస ఫ్లాపులతో ఉన్న శర్వానంద్ కి నిరాశ తప్పలేదు. జాను తో మంచి లాభాలు వస్తాయని ఆశ పడ్డ నిర్మాత దిల్ రాజు కి కూడా ఈ సినిమా ఊహించని విధంగా షాకిచ్చింది.
అయితే 2020 సంక్రాంతి బరిలో దిగిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో దిల్ రాజు నిర్మాతగా కొంత వరకు కష్టాల నుంచి గట్టెక్కాడు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో మూడు సినిమాలున్నాయి. వకీల్ సాబ్, హిందీ జెర్సీ రీమేక్ నిర్మాణ దశలో ఉండగా..నాని హీరోగా చేసిన వి రిలీజ్ కి రెడీగా ఉంది. మార్చి లోనే వి సినిమా రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేశారు. కాని అప్పటికే లాక్ డౌన్ మొదలుకావడంతో వి విడుదల కాలేదు. కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఉధృతం అవుతున్న నేపథ్యంలో థియేటర్స్ తెరుచుకోనే సూచనలు కనిపించడం లేదు.
దీంతో దిల్ రాజు వి సినిమాని ఓ టి టి లో విడుదల చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ విడుదల మూడు నెలలకు పైగా ఆలస్యం కావడంతో దిల్ రాజు ఏమి చేయాలో తేల్చుకోలేక పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నారట. నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితీ రావు హైదరీ హీరో హీరోయిన్స్ గా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వి భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.
అయినా రిస్క్ చేస్తూ బాలీవుడ్ లో దిల్ రాజు మరో సినిమాని నిర్మించడానికి రెడీ అయ్యారు. విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమాని హిందీలో రీమేక్ చేయనున్నారని అధికారకంగా దిల్ రాజు, కుల్దీప్ రాథోర్ వెల్లడించారు. బాలీవుడ్ యంగ్ హీరో రాజ్ కుమార్ రావ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు వెర్షన్ కి దర్శకత్వం వహించిన శైలేష్ కొలను నే హిందీలో కూడా తెరకెక్కించనున్నాడు.