శ్రీవెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన సినిమా వి. నేచురల్ స్టార్ నాని, నివేదా థామస్, సుధీర్ బాబు, అదితీ రావు హైదరీ హీరో హీరోయిన్స్ గా నటించారు. టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మొహన కృష్ణ దర్శకత్వం వహించాడు. దిల్ రాజు బ్యానర్ లో రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సినిమా గత మే నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా థియోటర్స్ మూత పడి రిలీజ్ కాలేదు.
అయితే అప్పటి నుంచి ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తారని పలుమార్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కాని నిర్మాత దిల్ రాజు మాత్రం అందుకు సిద్దంగా లేనంటూ చెప్పుకొస్తున్నారు. అయితే తాజాగా మరోసారి ఈ సినిమా రిలీజ్ విషయంలో ఒక వార్త బయటకు వచ్చింది. డిసెంబర్ వరకు కరోనా నుండి పరిస్థితులు చక్కబడి థియోటర్స్ ఓపెన్ అయితే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న వి సినిమాని రిలీజ్ చేస్తారని అంటున్నారు.
మరి ఇందులో ఎంతవరకు నిజముందో దిల్ రాజు అధికారకంగా వెల్లడిస్తే గాని క్లారిటీ వస్తుంది. ఇక ఈ సినిమాలో నాని విలన్ రోల్ పోషిస్తుండగా సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాని వరసగా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే నాని తో నిన్నుకోరి తీసిన శివ నిర్వాణ డైరెక్షన్ లో టక్ జగదీష్..అలాగే టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.