సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ లాక్ డౌన్ సమయంలో ఎన్ని సినిమాలను రిలీజ్ చేశాడో అందరికీ తెలిసిందే. సినిమా ఎంత సేపు ఉంది.. అది జనాలకి నచ్చిందా లేదా అన్న విషయం పక్కన పెడితే బాగా డబ్బు మాత్రం సంపాదించాడని చెప్పాలి. ఏం చేసిన రామ్ గోపాల్ వర్మ ప్లానింగ్ మాత్రం అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలవడం గొప్ప విషయమే.
ఆయనే ఎ.టీటీ అంటూ మొదలు పెట్టి తన సినిమాలని తనే రిలీజ్ చేయడం.. ఇప్పుడు అందరూ అదే దారిలో వెళ్ళాలనుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక తన సినిమాలతో సంచలనం రేపిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పలు రాజకీయ అంశాలని అలాగే నిజ జీవిత ఘటనలని ఆధారంగా చేసుకొని సినిమాలు తీస్తూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడు.
ఈ క్రమంలో కేవలం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు మాత్రమే కాకుండా “మర్డర్” , నగ్నం, థ్రిల్ లాంటి చిత్రాలని తీసి జనాలను ఆకట్టుకుంటున్నాడు. ఇపుడు మళ్ళీ పంథా మార్చి గత ఏడాది కలకలం రేపిన దిశా ఘటనపై “దిశా ఎన్కౌంటర్” అనే సినిమాని ప్రకటించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసాడు. అయితే వర్మ వాస్తవ ఘటనల తో పాటు తను చెప్పాలనుకున్నది చెప్తుంటాడు. అవి ఒక్కోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఒక్కోసారి మాత్రం నిరాశపరుస్తున్నాయి.
ఇక ఈ ఘటన అందరికీ తెలిసిందే కాబట్టి కేవలం దిశా మీద మాత్రమే కాకుండా అసలు ఆ ఘటన జరగడానికి ప్రధాన కారణం అయిన వారిని ఎలా హతమార్చారు అన్నదానిపైనే తీసే పయత్నం చేస్తున్నాడన్న టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమా టీజర్ ను వచ్చే సెప్టెంబర్ 26 న విడుదల చేయనుండగా సినిమాను నవంబర్ 26 న విడుదల చేస్తున్నట్టుగా వెల్లడించాడు వర్మ.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!