బాహుబలి ఫ్రాంఛైజీతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ అండ్ క్రేజ్ ని సాధించాడు ప్రభాస్. ఆ తర్వాత సాహో సినిమాతో తన రేంజ్ అండ్ క్రేజ్ ని రెట్టింపు చేసుకోవాలనుకున్న ప్రభాస్ ప్లాన్స్ అన్ని తలకిందులైయ్యాయి. ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గకూడదన్న ఆలోచనతో మరో యంగ్ డైరెక్టర్ జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ కెరీర్ లో 20 వ సినిమాని మొదలు పెట్టాడు. గోపీ కృష్ణ మూవీస్ సమర్పణలో యువి క్రియోషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రభాస్ కి జంట గా నటిస్తుంది.
ఈ సినిమాతో ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు కూతురు ప్రశీద మొదటిసారి నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుండటం విశేషం. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా ‘రాధే శ్యామ్’ టైటిల్ తో పాటు ప్రభాస్, పూజా హెగ్డేల ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. నాలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్టు క్లారిటీ ఇస్తూ చిత్ర బృందం నాలుగు భాషల్లో ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కి కొంత డివైడ్ టాక్ వచ్చింది.
ఇక ఈ సినిమా ఆగస్ట్ 15 నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో వేసిన సెట్ లో ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నారని తాజా సమాచారం. అయితే ఈ సినిమా వింటేజ్ ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది. ఈ నేపథ్యంలో సినిమాలో యూరోప్ నగరం బ్యాక్ డ్రాప్ లో కొన్ని కీలక సన్నివేశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఊహించని విధంగా పరిస్థితులు మారిపోవడంతో ఇక విదేశాల్లో షూటింగ్స్ చేసే అవకాశం లేదు. దీనితో 15 కోట్ల తో ఒక భారీ సెట్ ని ఇక్కడే నిర్మించనున్నారని తెలుస్తుంది. ఈ సెట్ లో మేజర్ టాకీ పార్ట్ కంప్లీట్ చేయనున్నారట. ఇక నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేయబో సినిమాకి రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ ని నిర్మించనున్నారట. మొత్తానికి ప్రభాస్ సినిమా అంటే ఖచ్చితంగా భారీ సెట్స్ ఉండాల్సిందే అన్నట్టుగా మారింది పరిస్థితి.