Hebba patel : హెబ్బా పటేల్ ఇక టాలీవుడ్ నుంచి సర్దుకున్నట్టేనా.. అంటే అవుననే మాట ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్ లో గట్టిగానే వినిపిస్తోంది. అలా ఎలా అన్న సినిమాతో టాలీవుడ్ లో ఎంటీ ఇచ్చిన హెబ్బా పటేల్ కుమారి 21 ఎఫ్ సినిమాతో టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకుంది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా తో హెబ్బ పటేల్ కే ఎక్కువ పేరొచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ లో యంగ్ హీరోల సినిమాలలో బాగానే అవకాశాలు దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత ఈడో రకం.. ఆడో రకం.. ఎక్కడికి పోతావు చిన్నవాడా.. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, 24 కిసెస్ లాంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది.
కాని కుమారి 21 ఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ మళ్ళీ అందుకోలేకపోయింది. ముఖ్యంగా ఎన్నో అంచనాలు పెట్టుకున్న 24 కిసెస్ భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత పెద్దగా హీరోయిన్ అవకాశాలు అందుకోలేకపోయింది. దాదాపు రెండేళ్ళ తర్వాత నితిన్ నటించిన భీష్మ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసింది. బాగా బొద్దుగా తయారైన హెబ్బా కి కాస్త నెగిటివ్ కామెంట్సే వచ్చాయి. అలాగే రాజ్ తరుణ్ తో ఓరేయ్ బుజ్జిగా అన్న సినిమా చేసింది. సినిమా హిట్ అయినా హెబ్బాకి మాత్రం పెద్దగా పేరు రాలేదు. ఇక లాభం లేదనుకొని ఐటెం సాంగ్స్ కి ఓకే చెప్పింది.
రాం నటించిన రెడ్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసింది. కాని రవితేజ నటించిన క్రాక్ సినిమాలో ఉన్న ఐటెం సాంగ్ కి వచ్చినంత పేరు రెడ్ సినిమాలో హెబ్బా సాంగ్ కి రాలేదు. అప్సర రాణి కి వరసగా ఐటెంస్ సాంగ్స్ లో చిందులేసే అవకాశాలు వస్తున్నాయి. కాని ఇక్కడా హెబ్బా కి చుక్కెదురైంది. హీరోయిన్ పోటీ ఉందని ఐటెం సాంగ్స్ లో నెట్టుకొద్దామనుకుంటే ఇక్కడ అప్సర రాణి లాంటి వాళ్ళు చెక్ పెడుతున్నారు. దాంతో ఇప్పుడు హెబ్బా పటేల్ కెరీర్ ఏంటన్నది డైలామాగా ఉందట. చూడాలి మరి నితిన్ – కీర్తి సురేష్ నటించిన రంగ్ దే సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతోంది. ఈ సినిమా హెబ్బకి ఎంతవరకు కలిసి వస్తుందో.