తెలుగమ్మాయి ఈషా రెబ్బ టాలీవుడ్ లో చలా సినిమాలే చేసింది. హీరోయిన్ అన్న మంచి పేరు దక్కింది గాని స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో మాత్రం తన పేరు చేర్చుకోలేకపోయింది. అందుకోసం చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంతక ముందు ఆ తర్వాత, అమీ తుమీ..అలాగే బ్రాండ్ బాబు, అ.., సుబ్రమణ్య పురం, అరవింద సమేత వీర రాఘవ, రాగల 24 గంటల్లో ..ఇలా మంచి సినిమాలే చేసింది. అయినా రావాల్సిన క్రేజ్ మాత్ర రావడం లేదు.
అందుకే రూటు మార్చి బోల్డ్ క్యారెక్టర్స్ కి ఒకే చెప్పింది. తెలుగులో రూపొందుతున్న లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో ఒక బోల్డ్ క్యారెక్టర్ చేస్తోంది. బాలీవుడ్ లో రాధికా ఆప్టే, కియారా అద్వాని లు చేసినటు వంటి పాత్ర అని అంటున్నారు. అంతేకాదు ఈషా ఈ క్యారెక్టర్స్ లో పర్ఫార్మెన్స్ పరంగా వాళ్ళని మించిపోతుందని చెప్పుకుంటున్నారు. ఇక ఈషా ప్రస్తుతం ఒప్పుకుంటున్న బోల్డ్ క్యారెక్టర్స్ విషయంలో చిన్నపాటి చర్చలు కూడా జరగడం ఆసక్తికరం.
ఈ నేపథ్యంలో ఈషా తాజాగా మరో వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. అందులోను బోల్డ్ క్యారెక్టర్ అని సమాచారం. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది చేస్తున్న ఓ వెబ్ సిరీస్ ఈషానే మెయిన్ లీడ్ రోల్ ప్లే చేస్తుందట. ఈ రోల్ చాలా బోల్డ్ అండ్ డార్క్ గా ఉంటుందని అంటున్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ రానుందట. ఈషా నటిస్తున్న సినిమాల విషయానికొస్తే అఖిల్ అక్కినేని నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాలో కనిపించనుంది. అలాగే ఒక తమిళ సినిమా..ఒక కన్నడ సినిమాలో నటిస్తోంది.