Hari hara veeramallu : టాలీవుడ్ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ కెరీర్ లో 27వ సినిమా హరిహర వీరమల్లు అనే టైటిల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహ శివరాత్రి కానుకగా రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ పవర్ స్టార్ అభిమానుల తో పాటు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఫస్ట్ గ్లింప్స్ చూసిన ఫాన్స్ అందరు పండగ చేసుకుంటున్నారు. చెప్పాలంటే ఇంకా ఆ హ్యాంగోవర్లోనే ఉన్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 40 శాతం కంప్లీటయింది. నిర్మాత ఏ.ఎం రత్నం దాదాపు 150కోట్ల భారీ బడ్జెట్ ని ఈ సినిమా కోసం కేటాయించాడని సమాచారం. పీరియాడికల్ సినిమా కాబట్టి దానికి తగ్గట్టే వీఎఫ్ ఎక్స్ వర్క్ కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణుల్ని క్రిష్ దించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మల్ల యోధులతో చేసే భారీ ఫైట్ సినిమాకి హైలెట్ గా నిలవబోతోందట. 17 వ శతాబ్ధం నాటి కాలాన్ని తలపించేలా చార్మినార్- రెడ్ ఫోర్ట్ – మచిలిపట్నం పోర్ట్ వంటి భారీ సెట్లని కూడా నిర్మించారని తెలుస్తోంది. ఇక ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.అయితే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది.
Hari hara veeramallu : హరిహర వీరమల్లు లో దొంగగా నిధి అగర్వాల్…!
శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ లో వీరమల్లు ఓ దొంగ అన్న హింట్ ఇచ్చాడు దర్శకుడు. వీరమల్లు అనే ఒక దొంగ కోహినూర్ వజ్రం దొంగిలించడానికి ప్రయత్నిస్తుంటాడని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ తో పాటు నిధి అగర్వాల్ కూడా ఓ దొంగగా కనిపించబోతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. పవన్ – నిధి మధ్య సన్నివేశాలను క్రిష్ వినోదాత్మకంగా చిత్రికరించినట్లు తెలుస్తుంది. ఇద్దరి మధ్య సన్నివేశాలను ఆసక్తిగా సాగుతాయని తెలుస్తోంది. అలాగే శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సోదరిగా కనిపించనుందట. కాగా ఈ సినిమా చిత్రీకరణ జులై నాటికి పూర్తవనుందని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.