‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, విజయ్ దేవరకొండ. వరసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ తో ఎంత క్రేజ్ అండ్ పాపులారిటీ వస్తుందో అంత క్రేజ్ ..పాపులారిటీ ఈ ఒక్క సినిమాతోనే ఇద్దరికి వచ్చేసింది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తున్నాడు. కాని సందీప్ వంగ మాత్రం తెలుగులో కొంత మంది హీరోలతో ప్రాజెక్ట్ అనుకొని అది వర్కౌట్ కాక బాలీవుడ్ వెళ్ళాడు. అక్కడ కూడా ‘అర్జున్ రెడ్డి’ సినిమాని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ సక్సస్ ని అందుకున్నాడు.
అంతేకాదు బాలీవుడ్ లో షాహిద్ కపూర్ కి ఇన్నేళ్ళుగా లేని క్రేజ్ అండ్ మార్కెట్ ని క్రియోట్ చేశాడు. హీరోయిన్ గా కియారా కి బ్లాక్ బస్టర్ దక్కింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లోనే మరో సినిమా చేస్తున్నాడు. ఇక లాక్ డౌన్ కారణంగా సందీప్ రెండు కథల్ని సిద్ధం చేసాడట. వాటిలో ఒకటి విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తాడని అంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ సినిమా మేకర్స్ టీ-సిరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతాని కలిసి సందీప్ తో ఒక సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారట.
ఈ ప్రాజెక్ట్ కి సందీప్ సోదరుడు, ‘అర్జున్ రెడ్డి’ నిర్మాత ప్రణయ్ వంగ కూడా నిర్మాణంలో భాగస్వామిగా ఉండబోతున్నారు. ఇక విజయ్ దేవరకొండ కోసం సందీప్ రాసిన కథ ఎలాంటిదన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కొందరేమో అర్జున్ రెడ్డికి సీక్వెల్ అని మాట్లాడుకుంటున్నారు. కొందరేమో ఇది కంప్లీట్ గా కొత్త తరహాలో ఉండే కథ అని అంటున్నారు. మరి సందీప్ ఏ జోనర్ లో కథ రాశాడో విజయ్ ని ఈ సారి ఎలా చూపించబోతున్నాడో వెల్లడిస్తేగాని తెలియదు అసలు కథేంటో. ఇక బాలీవుడ్ లో సందీప్ రెడ్డి అక్షయ్ కుమార్ తోను ఒక సినిమా చేస్తాడన్న వార్తలు వచ్చాయి. కాని ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ మాత్రం ఇంకా రాలేదు.