2019 ఎన్నికల ఫలితాల దెబ్బకి చంద్రబాబు యాక్టివ్ పాలిటిక్స్ కి చాలా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా రావటంతో చాలా వరకు చంద్రబాబు హైదరాబాద్ ప్రాంతానికే పరిమితం అయ్యారు. అక్కడ నుండే పార్టీ నాయకులతో క్యాడర్ తో వీడియో కాన్ఫరెన్స్ లు చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా టిడిపి పార్టీలో ఉండే కీలక నాయకులను చంద్రబాబు ఇటీవల పెద్దగా పట్టించుకోనట్లు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పదవుల విషయంలో బాబు వ్యవహరించిన తీరుపై పార్టీలో టాక్ వస్తోంది.
ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబాన్ని కావాలనే చంద్రబాబు సైడ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పరిటాల కుటుంబం మొదటి నుండి తెలుగుదేశం పార్టీని మోస్తూ వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా 2019 ఎన్నికలలో రెండు టికెట్లు పరిటాల కుటుంబం అడిగితే… రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ పరిటాల శ్రీరామ్ కు చంద్రబాబు కట్టబెట్టారు. పరిటాల శ్రీరామ్ పోటీ చేసిన మొట్టమొదటి ఎన్నికలలో ఓడిపోయారు.
దీంతో చంద్రబాబు పరిటాల కుటుంబాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదన్న టాక్ ప్రస్తుతం గట్టిగా వస్తుంది. మరోపక్క ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత పరిటాల వర్గం చాలా వరకు సైలెంట్ అయిపోయింది. నియోజకవర్గంలో కూడా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి పెద్దగా హడావిడి చేస్తున్న పరిస్థితులు కనబడటం లేదు. మరోపక్క వైసిపి పార్టీ సంక్షేమ పథకాలతో ఇలాంటి భేదాలు చూపించకుండా ఎటువంటి పార్టీకైనా అర్హులు అయితే వాళ్లకి సంక్షేమ పథకాలు అందిస్తుంది. మరోపక్క నిమ్మకునీరెత్తినట్లు పరిటాల ఫ్యామిలీ ఉంటున్నట్లు వార్తలు రావడంతో చంద్రబాబు తాజాగా పార్టీకి సంబంధించి నియమించిన ఇన్చార్జ్ పదవుల విషయంలో ఈ ఫ్యామిలీ ని లైట్ తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది.