‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమా సర్కారు వారి పాట. ఒక్క టైటిల్ .. ప్రీ లుక్ తోనే సినిమా మీద అంచనాలు పెంచేశారు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకి వెళుతుందా .. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి టిజర్ వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా వల్ల మహేష్ ఫ్యాన్స్ కి ఎదురు చూపులు అలానే ఉండిపోతున్నాయి.
ఎట్టకేలకి ఈ నవంబర్ నుంచి సినిమా విదేశాలలో షూటింగ్ ప్లాన్ చేసి మొదలు పెట్టాలనుకున్నారు మేకర్స్. అందుకు పరశురామ్ తన టీం తో అమెరికా వెళ్లి అక్కడ లొకేషన్స్ ని కూడా ఫైనల్ చేసుకొచ్చాడట. అయితే యూనిట్ సభ్యులకి వీసా సమస్య రావడం తో మరో రెండు నెలలు ఈ సినిమా పోస్ట్ పోన్ అయిందని తెలుస్తుంది. ఇక సర్కారు వారి పాట 2021 జనవరి లోనే సెట్స్ మీద వెళ్ళే అవకాశాలున్నాయని అంటున్నారు.
అయితే ఈ గ్యాప్ లో మహేష్.. త్రివిక్రం తో సినిమా చేస్తాడన్న టాక్ మొదలైంది. అందరు నిజమని భావించారు. కాని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో నిజం లేదని తెలుస్తుంది. త్రివిక్రం ఇప్పటికే ఎన్.టి.ఆర్ తో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న ఎన్.టి.ఆర్ .. ఆ సినిమా ఫినిష్ చేసి త్రివిక్రం తో సినిమా మొదలు పెట్టనున్నాడు.
అయితే ఇప్పుడు మహేష్ సర్కారు వారి పాట ని ఇండియాలోనే మొదలు పెట్టి ఉంటే అనుకున్న ప్రకారం 2021 సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేసే వారు మేకర్స్. కాని షూటింగ్ మొదలవడమే జనవరి లో కాబట్టి సమ్మర్ కి సర్కారు వారి పాట రావడం కష్టమే అంటున్నారు. ఇక ఈ సినిమాలో మేయిన్ హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతమందించనున్నాడు.