KGF 2 : కేజీఎఫ్ చిత్రాలతో దర్శకుడుగా పాన్ ఇండియన్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రశాంత్ నీల్. రాజమౌళి రేంజ్ ఒక్క కేజీఎఫ్ 1 సినిమాతోనే సంపాదించుకున్నాడు. దాంతో ఆయనతో సినిమా చేయడానికి సౌత్ హీరోలందరూ రెడీ అయ్యారు. వారిలో ఎక్కువగా టాలీవుడ్ స్టార్ హీరోలుండటం విశేషం. కాగా ఆయన ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు సలార్ సినిమాతో పాటు వరుసగా భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాలను కమిటయి ఉన్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్ తో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే నిర్మాతలు, దర్శకుడు ప్రశాంత్ నీల్ అలాగే ఎన్.టి.ఆర్ ఈ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడని సమాచారం. వీరి సినిమాల తర్వాత రాం చరణ్, దిల్ రాజు బ్యానర్ లో మళ్ళీ ప్రభాస్ హీరోగా సినిమాలు చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ప్రశాంత్ నీల్ మరో నాలుగేళ్ళు ఖాళీ లేనట్టే.
KGF 2 : కేజీఎఫ్ 2 సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా ఊహించని రేంజ్ లో ఓపెనింగ్స్
అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కేజీఎఫ్ 2 కంటే ముందే ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాను కంప్లీట్ చేస్తాడని చెప్పుకుంటున్నారు. అందుకు కారణం కన్నడ సినీ ప్రేక్షకులు యష్ కేజీఎఫ్ 2 సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ ను బాగానే ఒత్తిడి చేస్తున్నారట. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం అన్నీ సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నా కూడా కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ విషయంలో ఇంకా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. కేజీఎఫ్ 2 సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా ఊహించని రేంజ్ లో ఓపెనింగ్స్ గానీ భారీ వసూళ్లను రాబట్టడం ఖాయం. మరి ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇస్తారో చుడాలి.