నేచురల్ స్టార్ నాని లాక్ డౌన్ లో కాస్త గ్యాప్ తీసుకున్నప్పటికి వి సినిమా తర్వాత వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ వస్తున్నాడు. అంతేకాదు ఒక సినిమా తర్వాత ఒక సినిమాని సెట్స్ మీదకి తీసుకు వస్తున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న టక్ జగదీష్ సినిమాని డిసెంబర్ వరకు కంప్లీట్ చేసే దిశగా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుతున్నారు. ఈ సినిమా కంప్లీట్ చేస్తూనే మరో సినిమాని సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నాడు.
టాక్సీ వాలా సినిమాతో టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కబోయో శ్యామ్ సింగ్ రాజ్ డిసెంబర్ నుంచి ప్రారంభించబోతుండగా ఈ సినిమాలో నాని కి జంటగా సాయి పల్లవి, ఉప్పెన బ్యూటి కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా రీసెంట్ గా నాని 28 వ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ లో చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ ని రిలీజ్ చేశారు.
నవీన్ యెర్నేని – రవిశంకర్ వై. నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా ఫహాద్ నటిస్తోంది. ఇక ఫ్యామిలీ ఆడియెన్స్ లో నానికి ఉన్న క్రేజ్ ని దృష్ఠిలో పెట్టుకొని ”అంటే.. సుందరానికీ!” అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా 2021లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే నాని చేస్తున్నట్టు మాస్ ఎలిమెంట్స్ అంతగా ఉండవని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!