పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..నంబర్ వన్ ప్లేస్ లో ఉంది. ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. రాధే శ్యాం అన్న టైటిల్ పరిశీలనలో ఉంది. అలాగే అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాలో పూజా నే హీరోయిన్. ఈ రెండు సినిమాలు దాదాపు ఒకే ఏడాదిలో రిలీజ్ అయ్యో అవకాశాలున్నాయి.
ఇక ఈ సినిమాల తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్లో రాబోయో సినిమాలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఈ సినిమాలు కాకుండా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా అలాగే అక్షయ్ కుమార్ తో ఒక సినిమా చేస్తుంది. బాలీవుడ్ లో చేస్తున్న ఈ రెండు సినిమాలతో అక్కడ స్టార్ హీరోయిన్ అవ్వాలని ప్లాన్ చేస్తుంది. ఇంతక ముందు అక్కడ హృతిక్ రోషన్ తో చేసిన మొహంజాదారో భారీ ఫ్లాప్ గా మిగిలింది. దాంతో మళ్ళీ ఇన్నాళ్ళకు బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు రావడంతో చాలా నమ్మకంగా ఉంది.
అయితే టాలీవుడ్ లో ఈ స్ఠాయిలో సక్సస్ అందుకోవడానికి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలబడడానికి కారణాలు మాత్రం పూజా హెగ్డే మనస్తత్వమే అంటున్నారు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంది. కథ నచ్చడం వరకే ఆలోచించింది తప్ప రెమ్యూనరేషన్ గురించి ప్రస్తావించలేదట. పైగా మొదటి సినిమా ముకుంద నుంచి పూజా హెగ్డే మీద ఇండస్ట్రీలో మేకర్స్ కి గాని, హీరోలకి గాని పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ముఖ్యంగా ఇగో లేని హీరోయిన్ అన్న పేరు పొందింది. ఇక కథ డిమాండ్ చేస్తే బికినీకి లిప్ లాక్స్ కి..హాట్ సీన్స్ కి అడ్డు చెప్పకపోవడం పూజా హెగ్డేకి బాగా కలిసొచ్చింది. అందుకే పూజా హెగ్డే టాలీవుడ్ లో ఇంతగా పాపులారిటీని సాధించింది.