పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ చేస్తున్న మొదటి సినిమా “వకీల్ సాబ్”. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అజ్ఞలి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు క్రిష్ తో ఒక భారీ పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. శ్రీసూర్య మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎ.ఎం రత్నం నిర్మిస్తున్నారు.
అయితే ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్స్ మొదలయ్యే అవకాశాలులు కనిపించడం లేదని సమాచారం. అందుకు ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. “వకీల్ సాబ్” సినిమా కోసమే డిసెంబర్ లో షూటింగ్ కి హాజరవుతాడని అప్పటి వరకు ఏ సినిమా చిత్రీకరణలో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తుంది. కాబట్టి క్రిష్, పవన్ తో చేస్తున్న ప్రాజెక్ట్ కు ఊహించని షాక్ తగిలింది. మళ్ళీ క్రిష్, పవన్ సినిమా సెట్స్ మీదకి రావాలంటే 2021 లోనే అంటున్నారు.
దాంతో దర్శకుడు క్రిష్ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ తో ఓ ప్రాజెక్ట్ ను కమిటయ్యాడు. క్రిష్ సింగిల్ షెడ్యూల్ తోనే వైష్ణవ్ తేజ్ సినిమాను కంప్లీట్ చేస్తాడట. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వస్తాడని తాజా సమాచారం. ఇక వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఈ సినిమాకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించగా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ కలిసి నిర్మించారు. ఈ సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం అవుతుండగా రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.