హీరోయిన్ గా పరిచయం అయ్యాక ఫస్ట్ సక్సస్ అందుకోవడం ఎంత అదృష్టమో దాని లాంగ్ రన్ లో కాపాడుకోవడము అంతకన్నా కష్టం. స్టార్ హీరోయిన్ అయ్యాక ఆ స్టార్ ఇమేజ్ డామేజ్ అవకుండా ఉండాలంటే ఒప్పుకునే కథ అద్భుతంగా ఉండాలి. ఆ కథ ని సినిమాగా మలిచే టాలెంటెడ్ డైరెక్టర్ కావాలి. అన్ని పక్కాగా కుదిరినా కొన్నిసార్లు కథ మొత్తం తిరగబడిపోతుంది. ఊహించని షాక్ తగిలి కొన్నేళ్ళుగా కాపాడుకుంటూ వస్తున్న క్రేజ్ అండ్ పాపులారిటీ అంతా కూడా ఒక్కసారిగా పడిపోతుంది.
ఇక వీటికి కొన్ని సినిమాలు ఉదాహరణలుగా, కొంతమంది హీరోయిన్స్ అనుభవాలను కళ్ళారా చూశాక ఇంకొకరు ఆ పొరపాటు చేయాలంటే ధైర్యం చేయలేరు. ఇప్పుడు అక్కినేని సమంత ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక సినిమాని వదిలేసుకుందని చెప్పుకుంటున్నారు. మజిలీ, ఓ బేబీ సినిమాల తర్వాత హ్యాట్రిక్ హిట్ అవుతుందన్న నమ్మకంతో దిల్ రాజు నిర్మాతగా రూపొందించిన జాను సినిమాలో చేసింది. నిజానికి సమంత ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుంది.
కాని ఊహించని విధంగా ఈ సినిమా సమంత కి షాకిచ్చింది. దాంతో ఒక కథ ఒప్పుకోవాలంటే ఎన్నో రకాలుగా ఆలొచిస్తుందట. అయితే ఇప్పటికే తమిళం, తెలుగుతో పాటు మిగతా భాషలలో రిలీజ్ చేసే విధంగా ఒక పాన్ ఇండియన్ సినిమాని కమిటయిందట సమంత. ఈ సినిమాలో తనది చాలా ప్రత్యేకమైన పాత్ర అన్న కారణంగా ఒప్పుకుందట. కథ రిత్యా సమంత ఈ సినిమాలో మూగ అమ్మాయి పాత్రలో కనిపించాలి. సవాల్ గా ఉంటుందని ముందు కమిటయిందట.
అయితే జాను డిజాస్టర్ తో పాటు, ఇటీవల అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్ధం భారీ ఫ్లాప్ గా మిగలడంతో ఇక సమంత ఇలాంటి పాత్రలు మనకి వద్దని డిసైడయిందని సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న క్రేజ్ ని కాపాడుకోవాలంటే ఇలాంటి ప్రయోగాలు చేయకూడాని భావించి ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిందని తెలుస్తుంది. కాగా ఈ సినిమాని తమిళ దర్శకుడు అశ్విన్ శరవనన్ తెరకెక్కించాల్సింది. మరి ఇది నిజమా కాదా అన్నది మేకర్స్ గాని సమంత గాని క్లారిటీ ఇస్తే తెలుస్తుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!