Childrens: పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా మన రోజువారీ ఆహారంలో భాగం గా ఏ సీజన్ లో దొరికే పళ్ళు ఆ సీజన్లో కచ్చితంగా తినాలి. కనీసం లో కనీసం రోజుకు ఒక పండును అయినా తినాలి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది తల్లులు తమ పిల్లల ఆరోగ్యం దృష్ట్యా రకరకాల పళ్ళు పెట్టడం తో పాటు రోజుకో రకమైన పళ్ళ రసం తాగించేస్తూ ఉంటారు. కానీ ఆరోగ్యానికి పళ్ళు మంచిదా.. లేదా పళ్లరసం మంచిదా అనేదానితో పాటు పిల్లలకు ఏ పళ్ళు ఇవ్వాలి.. ఎప్పుడు ఇవ్వాలి అనేది తెలుసుకుందాం.
చాలా మంది తల్లులు పిల్లలకు పళ్ళు కు బదులుగా పళ్ళ రసాలు ఇస్తుంటారు . అయితే ప్రతి తల్లి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే షుగర్ అవసరం అయిన పిల్లలకు , బాగా నీరసంగా ఉన్న పిల్లలకు , పళ్ళు తింటే అరగని పిల్లలకు మాత్రమే పళ్ళ రసాలు ఇవ్వాలి.ఈ సమస్యలు లేకుండా చక్కగా తినగలిగిన వారికి పళ్ళు పెట్టడమే మంచి పద్దతి. పళ్ళ రసాలు అనేసరికి పంచదార కలిపి తయారు చేస్తాం. దీనివలన పిల్లలకు అధిక మొత్తం షుగర్ చేరుతుంది. కాబట్టి పళ్ళను నేరుగా తినడానికి ఇవ్వడం కరెక్ట్ పద్దతి .
కొంతమంది పిల్లలు పాలు తాగిన ఒక గంట , అరగంట లో మల్లి పళ్ళ రసం ఇస్తూ ఉంటారు. మనం ఇచ్చే బత్తాయి రసం వంటివి పుల్లగా ఉంటాయి. పాలు తాగిన వెంటనే ఈ జ్యూస్ లు ఇస్తే వెంటనే వాంతి చేసుకుంటారు. పుట్టలో పాలు విరిగి పోవడం దీనికి ప్రధాన కారణం. వీటన్నిటికంటే.. అరటి పండ్లు, ఆపిల్, కర్బూజ, పుచ్చకాయ లాంటి ఫ్రూట్స్ ని డైరెక్ట్ గా పెట్టడం మంచిది. పసిపిల్లలకు పెట్టవలిసినప్పుడు మాత్రం ఆపిల్ పండుని ఉడకపెట్టి తొక్కు తీసేసి మెత్తగా చేసి పెట్టాలి.