కరోనా మహమ్మారి తో ప్రపంచ వ్యాప్తంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అందరూ 2020 అని సంబరపడితే ఒక్కొక్కరికి వెన్నులో వణుకు తెప్పించింది. అందరి ఆశలు ఆనందాలు 2020 తారుమారు చేసింది. ప్రతీ ఇండస్ట్రీ దారుణంగా దెబ్బ తిన్నాయి. అందులో చిత్ర పరిశ్రమ మినహాయింపేమి కాదు. గత నాలుగైదు నెలలుగా షూటింగులు లేక అప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉన్న చాలా సినిమాలు విడుదల కాకుండానే ఆగిపోయాయి.
ఈ పరిస్థితులు ఇంకా ఇంత కాలం ఉంటుంది అని ఏ ఒక్కరు అంచనా వేయలేకపోతున్నారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ ఊపందుకుంది. ఓటిటి ఫ్లాట్ ఫామ్స్ ఈ సినిమాలతో క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అన్ని భాషల్లోని చాలా సినిమాలు నేరుగా ఓటిటిలో విడుదల అవుతున్నాయి. జనాలు కూడా బాగానే అట్రాక్ట్ అవుతున్నారు. మధ్యలో రాం గోపాల్ వర్మ ఏటీటీ అంటూ బయలు దేరాడు. ఆయనా బాగానే సక్సస్ అయ్యాడు.
ఈ క్రమంలో మన తెలుగులో కూడా చిన్న సినిమాలు చాలానే ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. కానీ స్టార్స్ నటించిన సినిమాలు మాత్రం మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే మన టాలీవుడ్ లో రిలీజ్ కాలేదని తెలిసిన సంగతే. అందరూ తమ సినిమాలని థియోటర్స్ లోనే రిలీజ్ చేయాలని ఇన్నాళ్ళు భావిస్తూ వచ్చారు. కానీ పరిస్థితులు చక్కబడే అవకాశం కనిపించకపోవడంతో టాలీవుడ్ మేకర్స్ కూడా నేరుగా ఓటిటిలో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.
ఇప్పటికే రిలీజ్ కి రెడీగా నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో నాని నటించిన “వి” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది. అలాగే రానా నటించిన “అరణ్య”, కోన వెంకట్ నిర్మాణంలో అనుష్క నటించిన “నిశ్శబ్దం”, మెగా మేనళ్ళుడి డెబ్యూ సినిమా “ఉప్పెన”, మెగా హీరో సాయి ధరం తేజ్ “సోలో బతుకే సో బెటర్” తో పాటు రాం నటించిన “రెడ్”. ఓటీటీలో రిలీజ్ చేయాలంటే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉన్నాయి. మరి రిలీజ్ చేస్తారా..మళ్ళీ మనసు మార్చుకొని థియోటర్స్ తెరవాలి అంటారా చూడాలి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!