సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి లైఫ్ టైం తక్కువ అన్న సంగతి తెలిసిందే. సంవత్సరంలో 20 హీరోయిన్స్ పరిచయమైతే ఇద్దరో ముగ్గురో అవకాశాలు అందుకుంటూ ఫాంలోకి వస్తుంటారు. అయితే ఇలా సక్సస్ అందుకున్న వాళ్ళు కూడా యంగ్ హీరోలతో చేసి వరసగా హిట్స్ అందుకున్నా రెమ్యూనరేషన్ ఒక మోస్తారుగా మాత్రమే పెరుగుతుంది. అదే సూపర్ స్టార్స్ పక్కన గనక నటిస్తే ఒక్క సినిమా తర్వాత ఆ హీరోయిన్ రేంజ్ అందనంత ఎత్తుకి చేరుకుంటుంది. ముఖ్యంగా మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ కి జంటగా నటిస్తే ఇక ఆ హీరోయిన్ ఇండస్ట్రీకొచ్చి నాలుగేళ్ళవక ముందే కోట్లలో రెమ్యూనరేషన్ పెరిగిపోతుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా హెగ్డే .. రష్మిక మందన్న ల రెమ్యూనరేషన్ భారీగా పెరగడానికి ఇదే కారణం అంటున్నారు. పూజా హెగ్డే అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం చేసింది. అప్పుడు రెమ్యూనరేషన్ తక్కువే. కాని మహేష్ తో మహర్షి, ఆ తర్వాత అరవింద సమేత… అల వైకుంఠపురములో సినిమాలు చేసింది. అయితే మహేష్ తో మహర్షి చేశాక పూజా రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందని చెప్పుకున్నారు. మొత్తానికి ప్రస్తుతం పూజా రెమ్యూనరేషన్ 2 కోట్లకి పైగానే ఉందని అంటున్నారు.
ఇక మరో లక్కీ హీరోయిన్ రష్మిక మందన్న కూడా బాగా డిమాండ్ చేస్తుందని.. అందుకు కారణం మహేష్ బాబు ఇచ్చిన బ్లాక్ బస్టర్ అని అంటున్నారు. మహేష్ బాబు కంటే ముందు గీత గోవిందం తో మంచి హిట్ అందుకుంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించిన సరిలేరు నీకేవ్వరు సినిమా తర్వాత రష్మిక కూడా 2 కోట్ల కి తగ్గడం లేదని అంటున్నారు. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సరిలేరు.. భీష్మ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు. 5 భాషల్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో రష్మిక భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటుందని సమాచారం. మొత్తానికి టాలీవుడ్ లో హీరోయిన్స్ కి మహేష్ తో నటించాక ఫేటే మారిపోతుంది.