సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోయో సర్కారు వారి పాట సినిమా విషయంలో టైటిల్ పోస్టర్ రిలీజైనప్పటి నుంచి ఏదో ఒక హాట్ న్యూస్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది. మహేష్ బాబు కెరీర్ లో 27 వ సినిమాగా తెరకెక్కబోయో సర్కారు వారి పాట సినిమాకి గీత గోవిందం ఫేం పరశు రాం దర్శకత్వం వహిస్తున్నాడు. జీ.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్, బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ ఈ సినిమాలో మహేష్ కి జంటగా నటించబోతున్నారని అంటున్నారు. అయితే తాజా సామాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో నటిస్తాడని తెలుస్తుంది.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరో హీరోగా నటిస్తుండగా ఫిక్షన్ కథాంశంతో కమర్షియల్ సినిమాగా రూపొందుతుంది. కొమరం భీం గా నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా కోసం చాలా సమయం కేటాయించడమే కాదు చాలానే కష్టపడుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మాటల మాంత్రీకుడు త్రివిక్రం సినిమాలో నటించడానికి రంగం సిద్దమవుతుంది.
ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా రాబోతుంది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఆంధ్రావాలా తర్వాత మళ్ళీ తారక్ డ్యూయల్ రోల్ లో కనిపించలేదు.
ఇక ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందబోయో పీరియాడికల్ మూవీలో కూడా ప్రభాస్ డ్యూయల్ రోల్ అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. అయితే ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ అన్న టాక్ వచ్చింది. మరి ఇప్పుడు హీరోలందరు డ్యూయల్ రోల్ క్యారెక్టర్స్ మీద ఆసక్తి చూపిస్తున్నారంటే ఇదేమైన కొత్త ట్రెండా అని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారట.