టీ, కాఫీ తాగేందుకు స్టాల్ కు పోయిన వెంటనే.. ప్లాస్టిక్ కప్ లో టీ, కాఫీని ఇవ్వమని అడుగుతుంటాం. కారణం వేరేవాళ్లనుంచి మనకు ఏ రోగం సోకకుండా కదా..? కానీ ఆ ప్లాస్టిక్ కప్ లో తాగడం వల్ల చాలా ప్రమాదమని ఒక రీసెర్చు చేబుతోంది. ఈ పరిశోధన తెలిపిన విషయాలను తెలుసుకుంటే ప్లాస్టిక్ కప్ లను ఆడగడం మానేస్తామేమో.. ఇలా ప్లాస్టిక్ కప్ లలో తాగడం వలన కొన్ని వేల హానికర మైక్రో ప్లాస్టిక్స్ మన శరీరంలోకి పోతాయని మీకు తెలుసా..?
ప్లాస్టిక్ కప్ లో వేడి వేడి టీ, కాఫీ తాగితే.. మంచి గురించి దేవుడెరుగు కానీ.. ప్రమాదం మాత్రం పొంచి ఉంటుందని ఇప్పుడు పరిశోధకులు తెలుపుతున్నారు. అయితే ప్లాస్టిక్ కప్ లో లీకేజీ కాకుండా ఒక లైనింగ్ ఉంటుంది. ఆ లైనింగ్ వల్ల వాటర్ ప్రూఫ్ అవుతుంది. కానీ ఆ లైనింగ్ ఇప్పుడు ప్రాణాలమీదకు వచ్చిందని పరిశోధకులు తెలుపుతున్నారు. అది కేవలం మన శరీరానికి హాని చేయడమే కాకుండా.. వాతవరణానికి కూడా ప్రమాదమని తెలుస్తోంది.
దీన్ని రీసైకిల్ చేయడం కూడా కష్టమేనని పరిశోధకులు తెలుపుతున్నారు. పరిశోధన చేయడానికి 100 మిల్లీ లీటర్ల వేడి నీటిని ఈ ప్లాస్టిక్ కప్ లో పోసి 15 నిమిషాలు ఉంచారు. ఆ తర్వాత ఆ నీటిని మైక్రో స్కోప్ తో పరీక్షించారు. దాంతో ఎన్నో విషయాలు బయట పడ్డాయి. ఆ నీటీలో హానికారకమైన జింక్, లెడ్, క్రోమియం ఉన్నాయని గుర్తించారు. అయితే ఈ హానికారకమైన లోహాలు ఉండటానికి కారణం ప్లాస్టిక్ కప్ లోని లైనింగ్ అని గుర్తించారు.
ఆ నీటిలో పరిశోధకులు కనిపెట్టిన పార్టికిల్స్ ఒక మైక్రాన్ అంత పెద్దగా ఉన్నట్లు పేర్కొన్నారు. రోజుకు మూడు సార్లు ప్లాస్టిక్ కప్ లో టీ, కాఫీ తాగే ఒక వ్యక్తి శరీరంలోకి 75 వేల చిన్న చిన్న మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ పోతాయని గుర్తించారు. దీంతో ఎంతో ప్రమాదం పొంచి ఉంటుందని పరిశోధకులు సూచించారు. అయితే ఈ ప్లాస్టిక్ కప్ లో వేడి పదార్థాలు పోసినప్పుడు వచ్చే పార్టికల్స్ మాములుగా మన కంటికి కనిపించమని పరిశోధకులు తెలిపారు.
మన శరీరానికి హాని చేసే పెలాడియం, క్రోమియం, కాడ్మియం వంటివి ఇందులో ఉంటాయని పేర్కొన్నారు. వీటిని రెగ్యులర్ గా శరీరంలోకి తీసుకుంటే.. హెల్త్ పాడవుతుందని తెలిపారు. అయితే ఫుడ్ ను ప్యాకేజింగ్ చేసేందుకు వాడే ప్లాస్టిక్ లో ఆరోగ్యానికి హాని చేసే కారకాలు ఉన్నట్లు ఇప్పటి వరకు గుర్తించలేదు. కానీ ప్లాస్టిక్ కప్ లు శరీరానికి హాని చేస్తాయని ఈ రీసెర్చ్ చెబుతోంది. దీనిపై ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?