జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విశాఖ పట్టణ వాసులకు మాత్రమే కాక ఏపీలో వెనకబడిపోయింది అనే పేరు ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతవాసులకు మేలు కలిగే నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో ఎప్పటి నుండో విశాఖపట్టణంలో భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఆ ప్రాంతంలో ఒక జెట్టీ కట్టాలన్నది కొన్ని దశాబ్దాలుగా మత్స్యకారులు రాజకీయ నాయకులను కోరడం జరిగింది.
అయితే ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీని పట్టించుకోని రీతిగా వ్యవహరించారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక భీమిలి జెట్టీ నిర్మాణంలో ముందడుగేస్తు పాలన చేయడంతో ఇప్పుడు ఆ ప్రాంత వాసుల్లో సంతోషం నెలకొంది. గతంలో బ్రిటిష్ వారు దేశాన్ని పాలించే సమయంలో ఇక్కడి నుండే షిప్పింగ్ కార్యకలాపాలు సాగేవి అని చాలామంది చెబుతారు.
అయితే విశాఖపట్టణం పోర్టు ఎప్పుడైతే ఏర్పడిందో భీమిలి ప్రాధాన్యత తగ్గిందని ఇటువంటి తరుణంలో జగన్ సర్కార్ జెట్టి నిర్మాణానికి ముందుకు రావటం తో మళ్లీ పూర్వ వైభవం భీమిలి పట్టణానికి రావడం గ్యారెంటీ అని ప్రాంత వాసులు అంటున్నారు. భీమునిపట్నం, నక్కపల్లిలోని రాజయ్యపేటలలో రెండు జెట్టీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిధ్ధమవుతోంది. దీంతో పాటు విశాఖ జిల్లాలో పూడిమడక వద్ద ఫిషింగ్ హార్బర్ ని కూడా నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. మొత్తం మీద చూస్తే విశాఖజిల్లాలోని మత్స్యకారులకు భారీ స్థాయిలోనే మేలు చేసే రీతిలో జగన్ సర్కార్ ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.