Prashanth varma : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ఒకరు ప్రశాంత్ వర్మ. ఈయన మొదటి సినిమా నుంచి ప్రయోగాలు చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నాడు. ఇండస్ట్రీకొచ్చే ఏ దర్శకుడైనా మాస్ సినిమాలను చేసి స్టార్ హీరోలతో అవకాశాలు అందుకోవాలను ట్రై చేస్తుంటారు. ఒక్క సినిమా చేయగానే రెండవ సినిమాకు పెద్ద హీరోని మైండ్ లో పెట్టుకొని కథ రాసుకోవడం ఆ హీరో కోసం ట్రై చేయడం షరా మామూలే. కమర్షియల్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలని చూస్తుంటారు.
కానీ ప్రశాంత్ వర్మ వీరందరికంటే పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. మొదటి సినిమా అ.! తెరకెక్కించాడు. నేచురల్ స్టార్ నాని దీనికి నిర్మాత. కాజల్ అగవాల్, రెజీనా, నిత్యా మీనన్ లాంటి వాళ్ళు నటించారు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ సాధించకపోయినా నిర్మాతగా నానికి..దర్శకుడిగా ప్రశాంత్ వర్మకి మంచి పేరు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత దీని సీక్వెల్ వస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఇది ఎందుకో సాధ్యమవలేదు. రాజశేఖర్ తో కల్కి సినిమాను తీసిన ప్రశాంత్ వర్మ హిట్ అందుకున్నాడు.
Prashanth varma : ప్రశాంత్ వర్మ – హీరో తేజ సజ్జకి మంచి బాండింగ్ ఉంది.
ఇక రీసెంట్గా చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జతో జాంబిరెడ్డి తీసి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాదు ఖచ్చితంగా అవార్డులు దక్కించుకుంటుందని చెప్పుకుంటున్నారు. కాగా ప్రశాంత్ వర్మ తాజాగా హనుమాన్ సినిమాను ప్రకటించాడు. ఆయన గత చిత్రాల మాదిరిగానే హనుమాన్ కూడా ఉండబోతోందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో జాంబిరెడ్డితో హీరో అయిన తేజ సజ్జ నటించబోతున్నాడనే మాట వినిపిస్తోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ – హీరో తేజ సజ్జకి మంచి బాండింగ్ ఉంది. అందుకే మరోసారి వీరిద్దరు కలిసి పనిచేయబోతున్నట్టు తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?