సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురాం కాంబినేషన్ లో తెరకెక్కబోయో తాజా చిత్రం సర్కారు వారి పాట. జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్, 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు. ఏడు సంవత్సరాల తర్వాత మహేష్ బాబు థమన్ ల కాంబినేషన్ రిపీటవుతుండటంతో మహేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అందుకు కారణం ప్రస్తుతం థమన్ టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉండటమే
ఇక ఈ సినిమా లో మహేష్ బాబు ఆర్ధిక నేరస్థుడిగా నటించబోతున్నాడని విశ్వసనియా వర్గాల సమాచారం. మహేష్ కెరీర్ లోనే ఇటువంటి పాత్ర చేయకపోవడంతో ఇండస్ట్రీ తో పాటు ప్రేక్షకుల్లోను ఈ పాత్ర మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది. దానికి తోడు టైటిల్ తో పాటు ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి అందరిలోను ఊహించనంతగా బజ్ క్రియోటయింది. చెప్పాలంటే మహేష్ బాబు ని పరశురాం ఆర్ధిక నేరస్థుడు గా చూపిస్తాడన్న విషయం తెలియగానే సినిమాని హాలీవుడ్ రేంజ్ లో ఊహించుకుంటున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకోవాలని టీం డిసైడయినట్టు తెలుస్తుంది. మహేష్ బాబుకి పర్ఫెక్ట్ అని తనని ఫైనల్ చేశారట. ఇక రీసెంట్ గా పెంగ్విన్ సినిమాతో ఆకట్టుకున్న కీర్తి సురేష్ సర్కారు వారి పాట లో చాలా డీసెంట్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. కీర్తి సురేష్ ఈ సినిమాలో బ్యాంకు ఎంప్లాయ్ గా కనిపిస్తుందట. ఇంటెలిజెంట్ మహేష్ ప్రేమలో పడే సాఫ్ట్ బ్యాంకు ఉద్యోగినిగా కీర్తి పాత్ర ఉంటుందని సమాచారం. ఇక సెకండ్ హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ ని పరిశీలిస్తున్నారట. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు- నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్ ‘దబాంగ్-3’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.