కెజిఎఫ్ ..ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం అందుకున్న సినిమా. భారీ కమర్షియల్ హిట్ గా నిలవడమే కాదు ఈ సినిమాతో కన్నడ హీరో యష్ అలాగే ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ అండ్ పాపులారిటీ అందరికీ తెలిసిందే. చెప్పాలంటే బాహుబలి సినిమా తర్వాత అంతగా చెప్పుకున్న సినిమా ఇదే కావడం విశేషం. ప్రముఖ సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ సమర్పణలో వచ్చిన ఈ సినిమా రిలీజైన అన్ని భాషల్లో వసూళ్ళ సునామీని సృష్ఠించడంతో అప్పుడే ఈ సినిమాకి సీక్వెల్ నిర్మించాలని మేకర్స్ రెడీ అయ్యారు.
అనుకున్నట్టుగానే కెజిఎఫ్ ఛాప్టర్ 2 అంటూ సినిమాని రూపొందిస్తున్నారు. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కాని కరోనా లాక్ డౌన్ వల్ల అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా చిత్రీకరణ దశలోనే ఆగిపోయింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఇంకా 15రోజుల టాకీ పార్ట్ చిత్రీకరణ జరపాల్సి ఉందని సమాచారం.
త్వరలోనే మిగిలిన టాకీ పార్ట్ ని కంప్లీట్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో కెజిఎఫ్ 2 రిలీజ్ డేట్ కూడా మారినట్లు తాజా తెలుస్తుంది. వాస్తవంగా కెజిఎఫ్2 ని అక్టోబర్ 23 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు ఇంతక ముందు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాని ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడం..అలాగే థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియకపోవడంతో కెజిఎఫ్ 2 ని 2021 సంక్రాంతి బరిలో దింపాలని మేకర్స్ రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేసినట్టు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?