Kiara advani : కియారా అద్వానీ టాలీవుడ్ లో నటించిన మొదటి సినిమా భరత్ అనే నేను. ఈ సినిమా భారీ కమర్షియల్ హిట్ సాధించింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో కియారా అద్వానీ గ్రాండ్ ఎంటీ క్రేజీ హీరోయిన్ గా మారింది. కానీ మరో సినిమా వినయ విధేయ రామ లో నటించి ఫ్లాప్ అందుకుంది. అయినా కియారా క్రేజ్ టాలీవుడ్ లో కాస్త కూడా తగ్గలేదు. అందుకే మన మేకర్స్ కియారా అద్వానీ డేట్స్ కోసం చాలా ట్రై చేశారు. అయితే అప్పటికే ఈమె హిందీ ఇండస్ట్రీలో లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ తో అలాగే అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ లతో విపరీతంగా క్రేజ్ తెచ్చుకొని అక్కడ బిజీగా మారింది.
దాంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా పెద్ద నిర్మాణ సంస్థల నుంచి భారీ అవకాశాలు అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ గా మారింది. దాంతో తెలుగు సినిమాలలో నటించే సమయం దొరకలేదు. ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది. కియారా అద్వానీ టాలీవుడ్ ప్రాజెక్ట్ కి సైన్ చేసిందని. కానీ అవి కేవలం రూమర్స్ గానే మిగిలాయి. అయితే ఈ మధ్య మళ్ళీ దీనికి సంబంధించిన వార్తలు మొదలయ్యాయి. ఆమె మళ్ళీ టాలీవుడ్ లో ఒక పాన్ ఇండియన్ సినిమా చేయడానికి ఒప్పుకుందని..త్వరలో ఇక్కడకి రాబోతుందని.
Kiara advani : కియారా ఇచ్చిన హింట్..జూనియర్ ఎన్.టి.ఆర్ సినిమాలో హీరోయిన్..!
ఇవి ఈసారి మాత్రం రూమర్స్ కాదంటున్నారు. కియారా అద్వానీ సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా వచ్చి 7 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా అభిమానులతో ఆసక్తి విషయాలను షేర్ చేసుకుంది. ఈ క్రమంలో మళ్ళీ నేను తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నాను. కొన్నాళ్ళు ఆగండి అని స్వయంగా తెలిపింది. విశ్వసనీయ వర్గాల ద్వారా కియారా ఇచ్చిన హింట్..జూనియర్ ఎన్.టి.ఆర్ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకి కొరటాల శివ డైరెక్టర్ కాబట్టి దాదాపు ఇది నిజమైన వార్తే అంటున్నారు. అలాగే పాన్ ఇండియన్ సినిమా శంకర్ – దిల్ రాజు – చరణ్ సినిమా కూడా అని అంటున్నారు. అయితే ఈ రెండు ఓకే చేసిందా..ఒకటేనా అన్నది త్వరలో తెలుస్తుంది.