కోన వెంకట్ ప్రముఖ రచయితగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతటి పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకి కథలు అందించి రచయితగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అంతేకాదు నిర్మాతగా మారి ఒకవైపు సినిమాలకి కథ అందిస్తూ మరొక వైపు సినిమా నిర్మాణంలో విజయవంతగా కొనసాగుతున్నాడు. కోన వెంకట్ నిర్మాణంలో వచ్చిన గత చిత్రం నిశ్శబ్ధం. పాన్ ఇండియన్ సినిమాగా వచ్చిన నిశ్శబ్ధంలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది. మాధవన్ .. అంజలి, శాలినీ పాండే కీలక పాత్రల్లో నటించారు.
అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమా మీద చిత్ర యూనిట్ మొత్తం భారీ అంచనాలు పెట్టుకుంటే ఊహించని విధంగా భారీ షాక్ ఇచ్చింది. అయినా కోన వెంకట్ మరో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. కరణం మల్లీశ్వరి బయోపిక్ ని నిర్మిచబోతున్నట్టు ఇప్పటికే అధికారకంగా కూడా వెల్లడించాడు. పాన్ ఇండియన్ సినిమాగా నిర్మించనున్నటు సమాచారం. ఇక ఈ సినిమాకి లేడీ డైరెక్టర్ సంజన దర్శకత్వం వహించబోతోంది. కాగా ఈ సినిమాలో కరణం మల్లీశ్వరి గా నటించే హీరోయిన్ ని ఫైనల్ చేసే ప్లాన్ లో ఉన్నాడు కోన వెంకట్.
అయితే ఇండస్ట్రీలో మహేష్ బాబు, ఎన్.టి.ఆర్ సహా పలువు స్టార్ హీరోలకి కథ అందించిన కోన వెంకట్ .. పవన్ కళ్యాణ్ కి మాత్రం కథ తయారు చేయలేకపోతున్నాడట. ఎప్పుడో పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికి కోన వెంకట్ మాత్రం పవన్ కళ్యాణ్ ని మెప్పించే కథ రెడీ చేయలేకపోతున్నాని అంటున్నాడు. పవన్ కళ్యాణ్ కోసం ఇప్పటికే కొన్ని కథలు రెడీ చేసినప్పటికి అవి కోన వెంకట్ కే నచ్చలేదట. అయితే ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ ని తన కథ తో మెప్పిస్తానని ఆ కథ ఏ ఒక్కరి ఊహకి అందని రేంజ్ లో ఉంటుందని చెప్పుకొస్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్ కోసం కోన వెంకట్ ఎప్పుడు కథ రెడీ చేసి ప్రాజెక్ట్ సెట్ చేస్తాడో చూడాలి.