అనుష్క నటించిన సినిమా నిశ్శబ్ధం. ఈ సినిమా గత మే లోనే రిలీజ్ కావాల్సి ఉండగా లాక్ డౌన్ తో థియోటర్స్ మూతపడి రిలీజ్ చేయలేదు చిత్ర యూనిట్. అయితే ఇలా ఎన్నాళ్ళులే అనుకున్న చిత్ర యూనిట్.. ఇంకా ఇలా ఎన్నాళ్ళు అన్న భావనలోకి వచ్చారు. దానికి తోడు ఇప్పటికే ఈ సినిమా చాలాసార్లు ఓటీటీలో రిలీజ్ చేస్తారన్న వార్తలు వచ్చాయి. కోన వెంకట్ క్లారిటీ ఇచ్చినా కూడా ఈ సినిమా రిలీజ్ విషయం మాత్రం వార్తలో నిలుస్తూనే ఉంది.
ఇక అనుష్క కూడా ఈ సినిమా రిజల్ట్ మీదే తన నెక్స్ట్ సినిమా ఆధారపడి ఉందని సమాచారం. అదీకాక ఈ మధ్య మన తెలుగు సినిమాలు ఓటీటీలో బాగానే రిలీజ్ అవుతున్నాయి. అల్లు అరవింద్ ఆహా లో ఒక్కో సినిమా రిలీజ్ అవుతోంది. దాంతో రీసెంట్ గా నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ ప్రేక్షకుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు మీరు నిశ్శబ్ధం సినిమాని ఎలా చూడాలనుకుంటున్నారు…థియోటర్స్ లోనా లేక ఓటీటీ లోనా …? అని ఒక పోల్ పెట్టారు.
ఈ క్రమంలో 56 శాతం మంది ఓటిటి లో చూసేందుకే ఆసక్తిగా ఉన్నట్టు తెలిసింది. దాంతో ఇప్పుడు ఈ సినిమాని ఓటీటిలో రిలీజ్ చేస్తారన్న టాక్ మొదలైంది. ఇక ఈ సినిమాని హేమంత్ మధుకర్ తెరకెక్కించాడు. మాధవన్, శాలినీ పాండే, అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత కోన వెంకట్ నిర్మాణంలో కరణం మల్లీశ్వరి బయోపిక్ రూపొందనుంది. సంజనా రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతుంది. అయితే ఇన్నాళ్ళు మా సినిమాని థియోటర్స్ లోనే రిలీజ్ చేస్తామని పట్టుదలగా ఉన్న కోన వెంకట్ ఉన్నట్టుండి ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు అన్న చర్చ మొదలైంది.