టాలీవుడ్ స్టార్ హీరోగా మహేష్ బాబు కి ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే పాన్ ఇండియా స్టార్ గా మాత్రం ప్రభాస్ యూనివర్సల్ గా క్రేజ్ అండ్ పాపులారిటీని సాధించాడు. బాహుబలి ఫ్రాంఛైజీ, సాహో సినిమాలు ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కి ప్రభాస్ ని టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ తో పాటు ఈ ఇయర్ ఎండింగ్ లో సెట్స్ మీదకి వెళ్ళబోతున్న నాగ్ అశ్విన్ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలుగా రూపొందిస్తున్నారు.
ఇక రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ తో ఎన్.టి.ఆర్, రాం చరణ్ లు పాన్ ఇండియా స్టార్స్ గా క్రేజ్ ని సాధించడం ఖాయమని ఇప్పటికే అందరూ డిసైడయ్యారు. ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పుష్ప అన్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా 5 భాషల్లో రిలీజ్ చేయడానికి పక్కా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అంతేకాదు మంచు హీరోలు, ఆది లాంటి వాళ్ళు కూడా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.
అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇంకా ఆ ఆలోచన చేయడం లేదని ఫ్యాన్స్ బాగా ఫీలవుతున్నారు. రాజమౌళి తో చేయబోయే సినిమా పాన్ ఇండియా సినిమా అయినప్పటికి ఆ సినిమా రావాలంటే ఇంకో రెండేళ్ళు పైనే పడుతుందని అంటున్నారు. దీంతో మహేష్ ని కూడా పాన్ ఇండియా స్టార్ గా చేయాలని దర్శకుడు పరశురాం సర్కారు వారి పాట ని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించబోతున్నట్టు తాజా సమాచారం. అందుకే పరశురాం బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న లోపాలు, మోసాలు అన్న యూనివర్సల్ కాన్సెప్ట్ ని మహేష్ కోసం సిద్దం చేశాడట. సో సూపర్ స్టార్ కూడా సర్కారు వారి పాట తో పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ కి పోటీ రాబోతున్నాడు.