ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘వి’. నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి నిర్మించారు. అదితి రావ్ హైదరి – నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. కరోనా మహమ్మారి లేకపోయి ఉంటే పోయిన ఉగాదికే ఈ సినిమా విడుదల కావాల్సింది. కాని ఇంకా కరోనా వ్యాప్తి తగ్గకపోవడంతో థియోటర్స్ ని ఓపెన్ చేయలేదు. దాంతో ఎట్టకేలకి ఈ సినిమాని సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
కాగా రీసెంట్ గా ‘వి’ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు. ఇక నాని కెరీర్లో 25వ సినిమాగా రాబోతున్న వి పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయితేగాని నాని మళ్ళీ సక్సస్ ట్రాక్ లోకి రాడు. కాబట్టే ‘వి’ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నప్పటికీ నాని ప్రమోషన్స్ ని బాగానే చేస్తున్నాడు. అయితే మల్టీస్టారర్ గా రూపొందిన ఈ సినిమాలో మరో హీరో సుధీర్ బాబు ఉన్నాడన్న విషయం దాదాపు అందరూ మర్చిపోయారా .. అన్న టాక్ వస్తోంది.
ఈ విషయంలో చిత్ర యూనిట్ కూడా సుధీర్ బాబు ని పెద్దగా పట్టించుకోలేదా..? అన్న ప్రచారం మొదలైంది. ఎక్కడా సుధీర్ బాబు ప్రస్తావన రాకపోవడమే ఇందుకు కారణం అని అంటున్నారు. అంతేకాదు అమెజాన్ వారికి సుధీర్ బాబు ఈ సినిమాలో క్యారెక్టర్ రోల్ చేస్తున్నాడనే ఫీడింగ్ వెళ్లడం కూడా మరో కారణం అని తెలుస్తుంది.
వాస్తవంగా అయితే ఈ సినిమాలో నాని, సుధీర్ బాబు క్యారెక్టర్స్ రెండు సమానంగా ఉండబోతున్నాయట. ‘వి’ ట్రైలర్ చూసినా ఈ విషయం అర్థమవుతుంది. ఇక సుధీర్ బాబు కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.
డూప్ లేకుండానే చాలా వరకు యాక్షన్ ఎపిసోడ్స్ చేశాడట. అయినా సుధీర్ బాబు కష్టాన్ని గుర్తించడం లేదని అభిమానులు ఫీలవుతున్నారట. ముఖంగా ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అయినట్టు.. కాస్త కోపంగా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా ‘వి’ విడుదలకు వారానికి పైగానే సమయం ఉంది. మరి ఇప్పటి నుంచైనా సుధీర్ బాబుని ”వి” సినిమా ప్రమోషన్స్ లో హైలెట్ చేస్తారా లేదా చూడాలి.