Mahesh Babu: సర్కారు వారి పాటను పాన్ ఇండియన్ రేంజ్లోనా..? అంటే అవుననే ఇప్పుడు టాక్ మొదలైంది. సూపర్స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా కోసం మహేష్ సరికొత్తగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. గంటల తరబడి జిమ్లో వర్కౌట్స్ చేసి ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం ఫిట్ బాడీతో అల్ట్రా స్టైలిష్ లుక్లో వచ్చేశారు. ఈ మూవీ మహేష్ సరసనన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన మెజారిటీ భాగం షూటింగ్ పూర్తైంది.
కొన్ని సీన్స్, సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉండగా..ప్రస్తుతం మేకర్స్ ఆ వర్క్ను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ నెలాఖరు వరకు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ మొత్తం పూర్తి కానుందని.. గుమ్మడికాయ కొట్టేస్తారని చెప్పుకుంటున్నారు. ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ కాబోతుందని ఇప్పటికే వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్, ఇటీవల వచ్చిన ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ చూస్తేనే అర్థమైంది. ఇక ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని ఇప్పటికే మే 12న రిలీ చేయనున్నామని అధికారికంగానూ చిత్రబృందం ప్రకటించింది.
Mahesh Babu: బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక మోసాలు అనే కథా నేపథ్యం..!
అయితే, తాజా సమాచారం మేరకు ‘సర్కారు వారి పాట’ కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. ఇప్పటికే హిందీ – తమిళ భాషలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని..మిగతా సౌత్ భాషలలో కూడా దీనిని రిలీజ్ చేసేలా ఇప్పుడు టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి మహేశ్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. గత చిత్రం సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ హిట్ తర్వాత మళ్ళీ ‘సర్కారు వారి పాట’ సినిమాతో రాబోతున్నాడు మహేశ్. స్టైలిష్ యాక్షన్ డ్రామాగా, బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక మోసాలు అనే కథా నేపథ్యంలో ఈ సినిమా రాబోతోంది.