Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 5 ఏళ్ళుగా ఈ మాట వినిపిస్తోంది. కానీ ఎప్పటికప్పుడు వీరి కాంబినేషన్ లో ప్రాజెక్ట్ పెండింగ్ పడుతూ వస్తోంది. బాహుబలి తర్వాత వీరిద్దరు కలిసి సినిమా చేస్తారని ప్రచారం జరిగింది. కానీ రాజమౌళి ఎన్.టి.ఆర్, రాం చరణ్లతో ఆర్ఆర్ఆర్ అనౌన్స్ చేసి డిసప్పాయింట్ చేశారు. అయితే ఈ సినిమా జరుగుతుండగానే మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. మహేష్ నుంచి కూడా కన్ఫర్మేషన్ వచ్చింది.
నిర్మాత, వ్యాపారవేత్త డా.కె.ఎల్ నారాయణ భారీ బడ్జెట్తో మహేష్ – రాజమౌళి సినిమా ప్రాజెక్ట్ను భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నట్టు తెలిపారు. దాంతో త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని అటు అభిమానులు ఇటు ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. కానీ కరోనాతో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ఆర్ఆర్ఆర్ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ సినిమా పూర్తయ్యేసరికి ఇంకా చాలా సమయమే పడుతుంది. కాబట్టి ఈ ఏడాది రిలీజ్ అనుకున్నది కాస్త వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవుతుందని మాట్లాడుకుంటున్నారు.
Mahesh : మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ కూడా మరో ఏడాది వెనక్కి..?
దాంతో ఇప్పుడు మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ కూడా మరో ఏడాది వెనక్కి వెళ్ళే అవకాశం ఉందట. అంటే 2022లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వచ్చే అవకాశాలున్నట్టు సమాచారం. దీనికి పూర్తి స్థాయి కథ సిద్దం చేయాల్సి ఉంది. మహేష్ కి నరేట్ చేయాలి..ఆయన అన్ని విధాలా తృప్తిచెంది స్క్రిప్ట్ ఓకే చేయాలి. ప్రీప్రొడక్షన్స్ వర్క్ కోసం చాలానే సమయం కేటాయించాలి. రాజమౌళి – మహేష్ కాంబోలో తెరకెక్కె సినిమా 2023 వరకు రావడం డౌటే అంటున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట చేస్తున్నాడు. త్వరలో త్రివిక్రం సినిమాను సెట్స్ మీదకు తీసుకు రాబోతున్నాడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?