Mahesh : మహేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబు కెరీర్ లో రాబోతున్న 27 వ సినిమా సర్కారు వారి పాటకి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. పరశురాం పెట్లా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ 14 రీల్స్ ప్లస్, తో కలిసి మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
కాగా ఈ సినిమాలో మహేష్, కీర్తి సురేష్ ల మధ్య అద్భుతమైన రొమాంటిక్ అండ్ లవ్ సీన్స్ ఉంటాయని సమాచారం. పరశురాం.. హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ బాగా రాస్తాడన్న పేరుంది. గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల మధ్య ఈ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాలో లవ్ ట్రాక్ అద్భుతంగా ఉంటుందని ఈ సీన్స్ నుంచి కామెడి కూడా బాగా వస్తుందని సమాచారం. ఇక ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోది.
Mahesh : మహేష్ సర్కారు వారి పాట అమెరికా షెడ్యూల్ ఉన్నట్టా లేనట్టా అన్నది మాత్రం క్లారిటీ లేదు.
అయితే ఇప్పటికే సర్కారు వారి పాట దుబాయ్ లో ఒక షెడ్యూల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ఆ తర్వాత అమెరికాలో ఒక షెడ్యూల్ ఉంటుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాని తాజా సమాచారం ప్రకారం మళ్ళీ సర్కారు వారి పాట టీం దుబాయ్ కే వెళ్ళాలని డిసైడయినట్టు సమాచారం. ఈ నెల 22 నుండి సర్కారు వారి పాట చిత్ర యూనిట్ దాదాపు మరో నెలపాటు షూటింగ్ జరుపనున్నట్లు తెలుస్తుంది. మరి అమెరికా షెడ్యూల్ ఉన్నట్టా లేనట్టా అన్నది మాత్రం క్లారిటీ లేదు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!