Manchu family : మంచు ఫ్యామిలీలో సీనియర్ స్టార్ మోహన్ బాబు, ఆయన కొడుకులు మంచు విష్ణు, మనోజ్ హీరోలుగా రాణిస్తున్నారు. అయితే గత రెండు మూడేళ్ళుగా ఈ హీరోలకి సరైన హిట్ దక్కడం లేదు. మోహన్ బాబు సీనియర్ కావడంతో సినిమాలు కాస్త తగ్గించారు. ఎప్పుడో గాని ఓ సినిమాతో రావడం లేదు. ఆయన కొడుకులు కూడా ఈ మధ్య బాగా గ్యాప్ తీసుకున్నారు. ఇద్దరికి వరుసగా ఆశించిన విజయాలు దక్కడం లేదు. గడిచిన రెండు మూడేళ్ళలో మనోజ్, విష్ణు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం లేదు.
అయితే ఇటీవలే విష్ణు నుంచి మోసగాళ్ళు సినిమా వచ్చింది. ఈ సినిమాకు ఆయనే నిర్మాత. హాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించాడు. సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇందులో విష్ణు సోదరిగా నటించింది. భారీ బడ్జెట్తో ఈ సినిమాను పాన్ ఇండియన్ రేంజ్లో నిర్మించాడు. కానీ భారీ అంచనాల మధ్య వచ్చి ఒక్కరోజులో నెగిటివ్ టాక్ రావడంతో పెట్టిన పెట్టుబడిలో సగం కూడా తిరిగి రాక బాగా డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఈ ఫ్యామిలీ హీరోలు నటిస్తున్న రెండు సినిమాల మీదే ఆశలన్నీ అని టాక్ వినిపిస్తోంది.
Manchu family : అహం బ్రహ్మాస్మి, సన్నాఫ్ ఇండియా సక్సెస్ అయితే ఈ ఫ్యామిలీకి కాస్త ఊరట లభిస్తుంది.
రచయిత, దర్శకుడు డైమండ్ రత్నబాబు ..మోహన్ బాబుతో సన్నాఫ్ ఇండియా అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైంది. తమిళ హీరో సూర్య రిలీజ్ చేసిన ఈ టీజర్ కి మెగాస్టార్ చిరంజీవి గాత్రం అందించారు. అభిమానుల నుంచి పాజిటివ్ గానే రెస్పాన్స్ వచ్చింది. ఇక మనోజ్ అహం బ్రహ్మాస్మి సినిమా చేస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియన్ సినిమానే. మనోజ్ సొంతగా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి భారీ బడ్జెట్ కేటాయించాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాల సక్సెస్ మీదే ఆశలన్ని పెట్టుకున్నారని చెప్పుకుంటున్నారు. అహం బ్రహ్మాస్మి, సన్నాఫ్ ఇండియా సక్సెస్ అయితే ఈ ఫ్యామిలీకి కాస్త ఊరట లభిస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?