పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ వకీల్ సాబ్ తో పాటు వరసగా నాలుగు సినిమాలని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంలో పవర్ స్టార్ నటిస్తున్న వకీల్ సాబ్ ఇటీవలే బ్యాలెన్స్ సీన్స్ కంప్లీట్ చేసేందుకు చిత్రీకరణ మొదలు పెట్టారు. ఈ సినిమా 2021 సంక్రాంతి బరిలో దింపాలని దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారట. ఇక హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాని డిసెంబర్ లో మొదలవబోతుందని సమాచార. అంతేకాదు 2021 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు షెడ్యూల్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
అలాగే క్రిష్, పవన్ కళ్యాణ్ సినిమా 2021 జనవరి నుంచి మళ్ళీ సెట్స్ మీదకి తీసుకు వెళ్ళి నాన్ స్టాప్ గా షూటింగ్ పూర్తి చేయాలని క్రిష్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాని దసరా పండుగ కానుకగా రిలీజ్ చేసే అవకాశాలున్నాయంటున్నారు. అంతేకాదు సురేందర్ రెడ్డి కి పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో రూపొందబోయో సినిమా కూడా 2021 ఆఖరున లేదా 2022 ప్రథమార్థం లో రిలీజ్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. మొత్తం మీద 2021 లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నుంచి 3 సినిమాలు వస్తాయని తెలుస్తుంది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరం తేక్ కూడా కూడా ఇదే ప్లాన్ లో ఉన్నాడట. తన సినిమాలు 2021 లో 3 రిలీజ్ చేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే సాయి ధరం తేజ్ – నభా నటేష్ జంటగా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ రిలీజ్ కి సిద్దంగా ఉందని సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి మూడవ సాంగ్ ని రిలీజ్ చేశారు. కుదిరితే ఈ సినిమాని సంక్రాంతి బరిలో దింపాలని మేకర్స్ భావిస్తున్నారట. అలాగే ‘ప్రస్థానం’ ఫేం దేవా కట్ట దర్శకత్వంలో తేజ్ చేయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలవబోతుండగా.. జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ – జె.పుల్లారావు నిర్మించనున్నారు. ఈ సినిమా 2021 లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక తో పాటు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ లో నటించనున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే గోపాలకృష్ణ అనే కొత్త దర్శకుడితో ‘భగవద్గీత సాక్షిగా’ అన్న సినిమా చేయడానికి సాయి ధరం తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈ సినిమా కూడా త్వరలో మొదలబోతుందని సమాచారం. మావయ్య పవర్ స్టార్ మాదిరిగానే సాయి ధరం తేజ్ కూడా 2021 లో 3 సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట.