చిత్రలహరి, ప్రతీరోజూ పండగే సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు సూపర్ హిట్స్ ని అందుకున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్. అంతకు ముందు కొన్ని వరస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. దాంతో కథ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని రెండు హిట్స్ కొట్టి మళ్ళీ సక్సస్ ట్రాక్ ఎక్కాడు. అంతేకాదు హ్యాట్రిక్ హిట్ కోసం సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ అన్న సినిమా చేశాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా మీద మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా ఎపుడో రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా రిలీజ్ కాకుండా ఆగిపోయింది. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా చాలా సార్లు ఓటీటీలో రిలీజ్ అవుతుందంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ మేకర్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఈ సినిమాని థియోటర్స్ లోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అన్నట్టుగానే ఈ నెల 25 వ తేదీన క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అంతేకాదు టాలీవుడ్ నుంచి థియోటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ సినిమా కూడా ఈ మెగా హీరోదే.
ఈ సినిమా రిజల్ట్ మీద .. వసూళ్ళ మీదే టాలీవుడ్ లో మిగతా సినిమాల రిలీజ్ లు ఆధారపడి ఉన్నాయని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా వసూళ్ళ పరంగా మన దగ్గర కొంతవరకు నమ్మకంగా ఉన్నప్పటికి చాలామంది ఓవర్సీస్ లో మాత్రం ఎటువంటి నమ్మకాలు పెట్టుకోవద్దని ముందుగానే హెచ్చరిస్తున్నట్టు సమాచారం. అందుకు కారణం ప్రస్తుతం అక్కడ తెలుగు సినిమాలు చూసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదని చెప్పుకుంటున్నారు. వాస్తవంగా మన సినిమాలు ఎక్కువగా ఓవర్ సీస్ బిజినెస్ పైనే ఆధారపడుతుంటాయి. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!