మొదటి సినిమాతోనే మెగాస్టార్ చిరంజీవి పోలికలతో ఉన్నాడు ..ఇండస్ట్రీలో మంచి క్రేజ్ రాబోతుందని మెగా మేనల్లుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్ గురించి అందరూ అనుకున్నారు. అనుకుంటున్నట్టుగానే ఈ మెగా మేనల్లుడు టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని తెచ్చుకున్నాడు. ‘చిత్రలహరి’ ‘ప్రతీరోజూ పండగే’ సినిమాలతో వరసగా సూపర్ హిట్స్ అందుకొని ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్ కోసం వేయిట్ చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. సుబ్బు దర్శకత్వంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో మంచి ఫాం లోకి వచ్చిన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఇక ‘ప్రస్థానం’ ఫేం దేవకట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సినిమా కూడా కమిటయ్యాడు. జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ – జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ యువ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మెగా మేనల్లుడు కొత్త దర్శకుడితో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి ‘భగవద్గీత సాక్షిగా’ అనే ఆసక్తికరమైన టైటిల్ ని అనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా రివేంజ్ డ్రామా బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కనుందని సమాచారం అని తెలుస్తోంది.
‘సోలో బ్రతుకే సో బెటర్’, దేవ కట్టా సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక ప్రముఖ నిర్మాత ఈ సినిమాని నిర్మిస్తారని త్వరలో అధికారకంగా ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయని తెలుస్తుంది. అయితే ఒకప్పుడు మెగాస్టార్ కూడా మిగతా స్టార్ హీరోలతో పోటీ పడి అలుపన్నది లేకుండా వరసగా సినిమాలు చేశారు. ఇప్పుడు ఈ మెగా మేనల్లుడు కూడా అదే దూకుడుతో ఈ విషయంలో మెగాస్టార్ కి పోటీగా నిలబడ్డాడని మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.