Mythri Movie Makers: అగ్ర నిర్మాణ సంస్థల మధ్య పోటీ అనేది ఇప్పటి నుంచి కాదు ఆ కాలం నుంచే ఉండేది. ఒక నిర్మాణ సంస్థలో ఓ అగ్ర హీరోతో సినిమాను ఒక అగ్ర నిర్మాత ప్రకటిస్తే అదే హీరోతోనో..లేక ఆ స్థాయికి మించిన స్టార్ హీరోతోనో..లేకపోతే అదే స్థాయి హీరోతో మరో నిర్మాణ సంస్థలో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేవారు. అంత పోటీ నిర్మాణ సంస్థల మధ్య ఉండేది. హీరో హీరోలకి మధ్య పోటీ ఎలా ఉంటుందో, దర్శకుల మధ్య పోటీ ఎలా ఉంటుందో భారీ బడ్జెట్ సినిమాలని నిర్మించడంలోనూ స్టార్ ప్రొడ్యూసర్స్ పోటీపడేవారు.
ఆ పోటీ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. టాలీవుడ్లో సురేశ్ ప్రొడక్షన్స్(Suresh productions), అన్నపూర్ణ స్టూడియో(Annapurna studio), పద్మాలయా స్టూడియోస్(Padmalaya studios) , గీతా ఆర్ట్స్(Geetha arts), శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్(Sri laxmi prasanna pictures) ..ఇవే ప్రధానంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలను నిర్మిస్తూ ఉండేవి. సూపర్ గుడ్ ఫిలింస్ లాంటి మరికొన్ని ఉన్నా కూడా ఎక్కువగా క్రేజ్ ఉండేది వీటికే. ఆ తర్వాత టాలీవుడ్లో డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ ప్రారంభించి సక్సెస్ అయిన రాజు దిల్ సినిమాతో సోలో ప్రొడ్యూసర్గా మారాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థను స్థాపించి చిన్న సినిమాల నుంచి ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలను నిర్మించే రేంజ్కి వచ్చాడు.
Mythri Movie Makers: వీరితో పోటీ పడేందుకు ఇప్పుడు అన్నీ నిర్మాణ సంస్థలు భారీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నాయి.
అయితే ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలన్నిటికి ఊహించని రేంజ్లో ప్రాజెక్ట్స్ను ప్రకటిస్తూ..ఆ ప్రాజెక్ట్స్ను పూర్తి చేస్తూ షాకిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) . కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers). వీరు ముగ్గురు నిర్మాతలు. నవీన్ యర్నేని, యలమంచిలి రవి శంకర్, మోహన్ చెరుకూరి. వీరు నిర్మాణ సంస్థ ప్రారంభించినప్పటి నుంచే పెద్ద హీరోలతో సినిమాలను నిర్మిస్తూ వస్తూ అగ్ర స్థానంలో నిలిచింది.
వీరితో పోటీ పడేందుకు ఇప్పుడు అన్నీ నిర్మాణ సంస్థలు భారీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నాయి. అయితే మైత్రీ వారు నిర్మిస్తున్న సినిమాలతో పోల్చుకుంటే మిగతా నిర్మాణ సంస్థలు కాస్త తక్కువే అని చెప్పాలి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి 14 రీల్స్ భాగస్వామ్యంతో సర్కారు వారి పాట నిర్మిస్తున్నారు. అలాగే పుష్ప సినిమాను మరో నిర్మాణ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. ప్రశాంత్ నీల్, ఎన్.టి.ఆర్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియన్ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే నందమూరి బాలకృష్ణ, క్రాక్ సినిమాతో ఫాంలోకి వచ్చిన గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఓ సినిమా మొదలు పెట్టబోతున్నారు.
Mythri Movie Makers: తెలుగులో అత్యధిక చిత్రాలను నిర్మిస్తున్న సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers).
ఉప్పెన సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిన బుచ్చిబాబుతో స్టార్ హీరోను పెట్టి ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ను నిర్మించబోతున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో భవదీయుడు భగత్సింగ్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాలను మైత్రీ వారు ప్లాన్ చేస్తున్నారు. వీటిలో తమిళ సినిమా, హిందీ సినిమాలు కూడా ఉన్నట్టు ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే తెలుగులో అత్యధిక చిత్రాలను నిర్మిస్తున్న సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers).